Political News

నేను క‌ను సైగ చేస్తే.. మీరు చిత్తు చిత్తు: చంద్ర‌బాబు

క‌ర్నూలు జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన చంద్ర‌బాబుకు తొలి రోజు నుంచి వైసీపీ నేత‌ల నుంచి అడ్డగింత‌లు ఎదుర‌వుతున్నాయి. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. హైకోర్టు విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా మూడో రోజు.. చివ‌రి రోజు ప‌ర్య‌ట‌న‌లోనూ వైసీపీ నాయ‌కుల‌, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను అడ్డగించారు. ఏకంగా టీడీపీ ఆఫీస్ వ‌ద్దే హ‌ల్చ‌ల్ చేశారు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇక‌, మూడో రోజు ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని మౌర్యా ఇన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కర్నూలు జిల్లా పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదరించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాలు నడుస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులంతా ఓ మాఫియాగా మారారని విమర్శించారు. రాష్ట్రానికి ఎన్ని రాజధానులు కావాలి.. ఒకటి సరిపోదా? అని ప్రశ్నించారు. 50 ఫెడరేషన్లు పెట్టి ఛైర్మన్లు పెట్టారని, వారికి జీతాలు, కుర్చీలు కూడా లేవన్నారు. ఏ2 సాయిరెడ్డి విశాఖపట్నంను దోచేస్తున్నారని, విశాఖలో 50 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, వైసీపీ పేటీఎమ్ బ్యాచ్‌ తనపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో అమరావతిని రాజధాని చేస్తామంటే జగన్ ఒప్పుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

This post was last modified on November 19, 2022 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

15 minutes ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

52 minutes ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

56 minutes ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

1 hour ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

3 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

4 hours ago