కాంతార సినిమాతో కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ చిత్రంలో నటుడిగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇవ్వడంతో పాటు దర్శకుడిగా గొప్ప నైపుణ్యం చూపించాడు రిషబ్. కెరీర్లో ఇప్పటిదాకా అతను తెచ్చుకున్న పేరంతా ఒకెత్తయితే.. ఈ సినిమాతో వచ్చిన పేరు మరో ఎత్తు. సామాన్య ప్రేక్షకుల నుంచి పేరుమోసిన క్రిటిక్స్, ఫిలిం మేకర్స్ వరకు అందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాంతార చూశాక రిషబ్ గత సినిమాలను వెతికి వెతికి చూస్తున్నారు జనం. ఇప్పుడతను మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ కమ్ యాక్టర్స్లో ఒకడైపోయాడు. ఇలా ఎక్కడ టాలెంట్ కనిపించినా టాలీవుడ్ నిర్మాతలు బుక్ చేసేయడం మామూలే. కాంతార సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా రిషబ్ కోసం కర్చీఫ్ వేసేశారు.
కాంతార సక్సెస్ మీట్ సందర్భంగా అరవింద్ స్వయంగా ఈ మేరకు ప్రకటన చేశౄడు. తమ గీతా ఆర్ట్స్ బేనర్లో సినిమా చేయాలని రిషబ్ను అడిగానని, అతను ఒప్పుకున్నాడని వేదిక మీదే ప్రకటించాడు. కాగా ఈ విషయాన్ని ఒక వెబ్ సైట్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. ఒక కన్నడ అభిమాని వెంటనే ఒక కౌంటర్ వేశాడు. నువ్వు కూడా కన్నడ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతున్నావా అని రిషబ్ను ట్యాగ్ చేసి ప్రశ్నించాడు. ఎవడో అనామకుడు అడిగాడని రిషబ్ దీన్ని పట్టించుకోకుండా వదిలేయలేదు. ఛాన్సే లేదు, నో వే అంటూ కన్నడలో సమాధానం ఇచ్చాడు.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో సంచలనం రేపాక.. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు అతడిపై పడిపోయారు. ప్రభాస్తో ఆల్రెడీ సలార్ చేస్తున్న ప్రశాంత్.. తర్వాత ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. తర్వాత కూడా అతను తిరిగి శాండిల్వుడ్కు వెళ్లడం కష్టంగా ఉంది. పేరు తెచ్చుకున్నాక కన్నడ ఇండస్ట్రీని వదిలేశాడంటూ ప్రశాంత్ మీద ఆల్రెడీ కన్నడిగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు రిషబ్ కూడా ఆ బాటలో పయనిస్తాడేమో అన్న ఉద్దేశంతోనే ఓ నెటిజన్ ఈ వ్యాఖ్య చేయగా.. రిషబ్ ఛాన్సే లేదని సమాధానం ఇచ్చాడు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…