పదేళ్ల ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. సౌత్ ఇండియాలో ఆయన్ని మించిన స్టార్ కనిపించేవాడు కాదు. ఆ మాటకొస్తే ఇండియా మొత్తంలో రజినీకి సాటి వచ్చే స్టార్లు కనిపించేవాళ్లు కాదు. భాషతో సంబంధం లేకుండా ఆయన పేరు చెబితే ఊగిపోయేవాళ్లు ప్రేక్షకులు. రోబో సినిమాతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారాయన. పారితోషికం, బడ్జెట్లు, వసూళ్లు.. ఇలా అన్నింట్లోనూ ఆయన పేరిట రికార్డులు ఉండేవి.
కానీ రోబో తర్వాత ఒక్కటీ సరైన సినిమా చేయకపోవడం, సినిమా సినిమాకూ క్వాలిటీ పడిపోతూ రావడంతో ఆయన క్రేజ్ చాలా వరకు కరిగిపోయింది. మార్కెట్ పడిపోయింది. సామాన్య ప్రేక్షకులతో పాటు అభిమానులకూ ఆయన మీద నమ్మకం సడలిపోయింది. చివరగా రజినీ నుంచి వచ్చిన అన్నాత్తె చూసి ఆయనిక సినిమాలు ఆపేస్తే బెటర్ అన్న వాళ్లు చాలామందే ఉన్నారు.
అన్నాత్తె తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న రజినీ ఇప్పుడు మళ్లీ జైలర్ మూవీ కోసం ముఖానికి రంగు వేసుకుంటున్నారు.
సోమవారమే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సందర్భంగా రజినీని సూపర్ స్టైలిష్గా చూపిస్తూ ఒక పోస్టర్ లాంచ్ చేశారు. అది వావ్ అనిపించేలాగే ఉంది. రజినీ కూతురు ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్న ఆయన మాజీ అల్లుడు ధనుష్ సైతం ఈ పోస్టర్ చూసి వావ్ అనే కామెంట్ చేశారు. రజినీని చాలా స్టైలిష్గా, ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్. ఐతే ఇలా పోస్టర్లు, టీజర్లతో రజినీ వారెవా అనిపించడం, తీరా సినిమా చూస్తే తుస్సుమనడం మామూలైపోయింది.
కబాలి నుంచి అన్నాత్తె వరకు చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అందుకే అభిమానులు మరీ ఎగ్జైట్ అయిపోవట్లేదు. నెల్సన్ చివరి సినిమా బీస్ట్ చూశాక జైలర్ మీద అంచనాలు తక్కువగానే పెట్టుకున్నారు. ఆ డిజాస్టర్ తర్వాత నెల్సన్ కసిగా పని చేసి తన తొలి రెండు చిత్రాల స్థాయిలో ఒక బ్లాక్సబ్టర్ ఇచ్చి రజినీ అభిమానులను మురిపిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 23, 2022 8:27 am
అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్.. సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు…
సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి.…
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…
ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు.…
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…