పదేళ్ల ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. సౌత్ ఇండియాలో ఆయన్ని మించిన స్టార్ కనిపించేవాడు కాదు. ఆ మాటకొస్తే ఇండియా మొత్తంలో రజినీకి సాటి వచ్చే స్టార్లు కనిపించేవాళ్లు కాదు. భాషతో సంబంధం లేకుండా ఆయన పేరు చెబితే ఊగిపోయేవాళ్లు ప్రేక్షకులు. రోబో సినిమాతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారాయన. పారితోషికం, బడ్జెట్లు, వసూళ్లు.. ఇలా అన్నింట్లోనూ ఆయన పేరిట రికార్డులు ఉండేవి.
కానీ రోబో తర్వాత ఒక్కటీ సరైన సినిమా చేయకపోవడం, సినిమా సినిమాకూ క్వాలిటీ పడిపోతూ రావడంతో ఆయన క్రేజ్ చాలా వరకు కరిగిపోయింది. మార్కెట్ పడిపోయింది. సామాన్య ప్రేక్షకులతో పాటు అభిమానులకూ ఆయన మీద నమ్మకం సడలిపోయింది. చివరగా రజినీ నుంచి వచ్చిన అన్నాత్తె చూసి ఆయనిక సినిమాలు ఆపేస్తే బెటర్ అన్న వాళ్లు చాలామందే ఉన్నారు.
అన్నాత్తె తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న రజినీ ఇప్పుడు మళ్లీ జైలర్ మూవీ కోసం ముఖానికి రంగు వేసుకుంటున్నారు.
సోమవారమే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సందర్భంగా రజినీని సూపర్ స్టైలిష్గా చూపిస్తూ ఒక పోస్టర్ లాంచ్ చేశారు. అది వావ్ అనిపించేలాగే ఉంది. రజినీ కూతురు ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్న ఆయన మాజీ అల్లుడు ధనుష్ సైతం ఈ పోస్టర్ చూసి వావ్ అనే కామెంట్ చేశారు. రజినీని చాలా స్టైలిష్గా, ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్. ఐతే ఇలా పోస్టర్లు, టీజర్లతో రజినీ వారెవా అనిపించడం, తీరా సినిమా చూస్తే తుస్సుమనడం మామూలైపోయింది.
కబాలి నుంచి అన్నాత్తె వరకు చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అందుకే అభిమానులు మరీ ఎగ్జైట్ అయిపోవట్లేదు. నెల్సన్ చివరి సినిమా బీస్ట్ చూశాక జైలర్ మీద అంచనాలు తక్కువగానే పెట్టుకున్నారు. ఆ డిజాస్టర్ తర్వాత నెల్సన్ కసిగా పని చేసి తన తొలి రెండు చిత్రాల స్థాయిలో ఒక బ్లాక్సబ్టర్ ఇచ్చి రజినీ అభిమానులను మురిపిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 23, 2022 8:27 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…