ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగు సినీ పరిశ్రమలో నంబర్వన్ స్థానాన్ని చేజిక్కించుకుని కొన్ని దశాబ్దాలు పాటు ఆ స్థానంలో కొనసాగడం అంటే మాటలు కాదు. మెగాస్టార్ చిరంజీవికి సాధ్యమైన అరుదైన ఘనత ఇది. ఆయన ప్రస్థానం కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ పెద్ద స్ఫూర్తి పాఠమే. ఐతే తాను నంబర్ వన్ హీరో అవుతానని చిరు ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టకముందే ఒకరి దగ్గర ఛాలెంజ్ చేశారట.
ఆ విషయాన్ని చిరంజీవి తనయుడు నాగబాబు స్వయంగా వెల్లడించాడు. సోమవారం చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన మెగా కార్నివాల్ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు ఒక ఆసక్తికర పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. నాగబాబు మాటల ప్రకారం.. 21 ఏళ్ల వయసులోచిరంజీవి చెన్నైలోని ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటూ ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉండేవాడు.
ఆ గది పక్కనే పూర్ణ పిక్చర్స్ ఆఫీస్లో మేనేజర్గా పని చేసే వ్యక్తి భార్య ఒక రోజు చిరుతో పాటు అతడి స్నేహితులను ఓ సినిమా ప్రివ్యూ చూడమని థియేటర్లో కూర్చోబెట్టారు. ఐతే కొంతసేపటికి ఆ సినిమా హీరో, ఆయన మనుషులు వచ్చి సీట్లు ఖాళీ లేకపోవడంతో చిరు, ఆయన మిత్రులను లేపి పంపించేశారు. అప్పుడు వాళ్లు వెనుక నిలబడే సినిమా చూశారు.
సినిమా అయ్యాక ఎలా ఉందో తెలుసుకుందామని మేనేజర్ భార్య వీళ్లను పిలిపించి అడిగి.. ‘‘సినిమా బాగానే ఉంది కానీ.. మీ తరఫున వెళ్లిన మమ్మల్ని హీరో తాలుకా మనుషులు వచ్చారని గుమ్మం దగ్గర నిలబెట్టారు. బయటకు వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందమో అని ఆలోచించాం ఆంటీ. వీళ్లందరికీ బాగా బలిసికొట్టుకుంటున్నారు’’ అని అన్నాడట చిరు.
ఆ హీరో అంతేలే.. నువ్వు పట్టించుకోకు అని ఆమె అనగా.. ‘‘అదంతా అహంకారం ఆంటీ. చూస్తూ ఉండండి. ఈ ఇండస్ట్రీకి నంబర్వన్ హీరో కాకపోతే నన్ను అడగండి’ అని చిరు సవాలు చేశాడట. ఈ విషయాన్ని చిరు స్నేహితుడు తర్వాత ఓ సందర్భంలో తనకు చెబితే షాకయ్యానని నాగబాబు తెలిపాడు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబు వంటి స్టార్లు ఉన్న సమయంలో ‘నేనే నంబర్ వన్’ అవుతా అని ఓ కుర్రాడు అన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలని, ఏదైనా సాధించాలనే తపన ఉంటే తప్పకుండా సాధిస్తారని.. తన అన్నయ్య జీవితం కంటే గొప్ప మోటివేషన్ ఏదీ ఉండదని నాగబాబు వ్యాఖ్యానించాడు.
This post was last modified on August 22, 2022 2:58 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…