Political News

భేటీలో ఏమి జరిగిందో ?

రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ ఊరికే కలవరు. ఇపుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీయార్ మధ్య భేటీ ఇందుకే ఆసక్తిగా మారింది. ఆదివారం రాత్రి ఒక హోటల్లో వీళ్ళిద్దరు సుమారు 45 నిముషాలు విందు సందర్భంగా  భేటీ అయ్యారు. వీళ్ళతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా ఉన్నారు. అయితే భోజనం అయిపోయిన తర్వాత అమిత్, జూనియర్ 20 నిముషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

ఆ 20 నిముషాల్లో ఏం మాట్లాడుకున్నారు ? అన్నదానిపైనే అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. బహుశా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించమనో లేదా పార్టీ తరపున ప్రచారం చేయమనో జూనియర్ ను అమిత్ అడిగుంటారనేది అందరూ అనుకుంటున్నమాట. పై రెండు కాకపోతే జూనియర్ ను అమిత్ కలవాల్సిన అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ నటనను అభినందించేందుకే అమిత్ భేటీ అయ్యారని చెప్పటం ఉత్త సొల్లని అందరికీ తెలుసు.

భేటీ ఇద్దరు మధ్య మాత్రమే జరిగింది కాబట్టి ఏమైనా చెబితే ఈ ఇద్దరే చెప్పాలి. అయితే తమ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఈ ఇద్దరూ బయటకు చెప్పరు. కాబట్టి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. కాకపోతే ఓ రెండు రోజులు ఆగితే అప్పుడు విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. ఎలాగంటే తమ భేటీ ఉద్దేశ్యం జూనియర్ ఎవరైనా సన్నిహితులతో పంచుకునే అవకాశముంది.

అంటే విషయం ఏదైనా ఉంటే అది జూనియర్ వైపునుండి మాత్రమే బయటకు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.  జూనియర్ భేటీలో ఏం జరిగిందనే విషయాన్ని నరేంద్ర మోడీకి కచ్చితంగా అమిత్ షా  బ్రీఫింగ్ ఇస్తారు. ఎందుకంటే మోడీ ఆదేశాలు లేనిదే షా ఏమిచేయరని అందరికీ తెలుసు. మోడీ నుండి ఏ విషయమూ  ఎలాగూ బయటకు రాదు. కాబట్టి ఒక రెండు రోజులు ఆగితే  ఏదో రూపంలో విషయం బయటకు వచ్చే అవకాశముంది.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago