Political News

జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. కీల‌క ప‌రిణామాలు ఏంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లారు. ఆయ‌న నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట‌కు పైగానే.. ప్ర‌ధాని.. జ‌గ‌న్‌కు స‌మ‌యం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏం చ‌ర్చించుకు న్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం కేంద్రం ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు కూడా లేవు. పైగా రాష్ట్ర ప‌తిఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు కూడా ముగిసిపోయాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అవ‌స‌రం కేంద్రానికి పెద్ద‌గా లేదు. ఇక‌, జ‌గ‌న్‌కు మాత్రం చాలానే అవ‌స‌రాలు ఉన్నాయి.

ఇటు రాజ‌కీయంగా.. అటు పాల‌నాప‌రంగా..జ‌గ‌న్‌కు కేంద్రం నుంచి సంపూర్ణ స‌హ‌కారం అవ‌స‌రం. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పర్య‌ట‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఇచ్చిన వివ‌ర‌ణ మేర‌కు.. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన.. 1-జన్‌పథ్‌లో బస చేశారు. పోలవరం అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు స‌ర్కారు వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పెండింగు బిల్లులు మంజూరు చేయాలని కోరడంతో పాటు, నిర్వాసితులకు పునరావాస కల్పనపై ప్రధానితో సీఎం చర్చిస్తార‌ని తెలిపాయి.

అదేస‌మ‌యంలో రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సాయాన్ని సీఎం కోరనున్నారని చెప్పాయి. నూతన వైద్య కళాశాలలకు అనుమతులతో పాటు, కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు విభజన చట్టంలోని హామీలపైనా మరోసారి విజ్ఞప్తి చేస్తారని వెల్లడించాయి. నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌లను కూడా ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉందని వెల్లడించాయి.

అయితే.. స‌ర్కారు చెబుతున్న స‌మాచారం నిజ‌మే అయితే..ఇది కొత్తేమీ కాదు.. ఆయా స‌మ‌స్య‌లు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కూడా ఉన్నాయి. కానీ..ఇప్ప‌టికిప్పుడు ఇంత హ‌డావుడిగా వెళ్ల‌డం మాత్రం ఆస‌క్తిగా మారింది. దీని వెనుక‌.. మారుతున్న రాజ‌కీయాలు.. సీబీఐ ద‌ర్యాప్తులు.. వ‌చ్చే నెల‌లో సీబీఐ విచార‌ణ వంటివి ఉన్నాయ‌నేది.. రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఏదేమైనా.. ఈ అనూహ్య ప‌ర్య‌ట‌న జ‌గ‌న్‌కు మేలు చేస్తుందా?  లేదా? అనేది చూడాలి.

This post was last modified on August 22, 2022 1:49 pm

Share

Recent Posts

దండోరా దర్శకుడు భలే షాకిచ్చాడే

ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…

3 minutes ago

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

1 hour ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

3 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago