స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చేశాడు తమిళ నటుడు ధనుష్. కెరీర్ ఆరంభంలో అతడి అవతారం చూసి ఇతను హీరో ఏంటి అని చాలామంది కామెడీ చేశారు. కానీ నవ్విన నాపచేనే పండినట్లు తనను ఎగతాళి చేసిన వాళ్లే తన నటన చూసి ముక్కున వేలేసుకునేలా చేశాడతను. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారిని, బాలీవుడ్ మూవీస్ ద్వారా హిందీ ప్రేక్షకులకు కూడా తన ప్రతిభేంటో తెలిసేలా చేశాడతను.
ఈ మధ్య ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫాకిర్, ది గ్రేమ్యాన్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాడు. ఐతే ఇంటర్నేషనల్ రేంజికి ఎదిగినప్పటికీ.. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా అతి సామాన్యుడి పాత్రలు చేయడం ధనుష్కే చెల్లు. తాజాగా గతంలో ఎన్నో షాకింగ్ క్యారెక్టర్లు చేసిన అతను.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ క్యారెక్టర్ చేయడం విశేషం. తిరుచిత్రాంబళం.. ధనుష్ నటించిన కొత్త సినిమా ఇది.
మిత్రన్ జవహార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో ధనుష్ ఫుడ్ డెలివరీ బాయ్గా కనిపించాడు. ఇందులో మూడు లేడీ క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకరు నిత్యామీనన్. కానీ ఆమెది కథానాయిక పాత్ర కాదు. ధనుష్ క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్. ప్రియ భవానీ శంకర్, రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. వీళ్లతో ధనుష్ రొమాన్స్కు పక్కనుండి సహకారం అందించే పాత్ర నిత్యాది.
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ధనుష్కు తాత పాత్రలో నటించగా.. ప్రకాష్ రాజ్ తండ్రిగా పోలీస్ క్యారెక్టర్ చేశాడు. సినిమా రొమాన్స్, కామెడీ ప్రధానంగా సాగేలా ఉంది ట్రైలర్ చూస్తే. రాశి ఖన్నాతో ధనుష్కు ఇందులో ముద్దు సీన్ కూడా ఉంది. కాకపోతే అది లిప్ లాక్ కాదు. తమిళంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న రాశికి ఈ సినిమాలో మంచి పాత్రే దక్కినట్లుంది. ఈ నెల 18న తిరుచిత్రాంబళం థియేటర్లలో విడుదల కానుంది.
This post was last modified on August 8, 2022 5:19 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…