Movie News

హరికృష్ణ వద్దన్నా.. బాలయ్య పట్టుబట్టి


నందమూరి కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన మూడో తరంలో తొలి వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్. అతను పిల్లాడిగా ఉన్నపుడే ‘బాల గోపాలుడు’ సినిమాతో తెంరగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం. ఆ సినిమా చేసే సమయానికి కళ్యాణ్ రామ్ ఏడో తరగతి చదువుతున్నాడట. తనను నటుడిగా పరిచయం చేస్తానని బాలయ్యే ప్రతిపాదించగా.. ఆయన సోదరుడు, కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ ఒప్పుకోలేదట. సినిమాల మోజులో పడితే చదువు పాడవుతుందేమో అన్న భయంతో ఆయన వెనుకంజ వేశారట. కానీ బాలయ్య మాత్రం పట్టుబట్టి, అలా ఏమీ జరగదని ఒప్పించి కళ్యాణ్ రామ్‌ను తన సినిమాలో నటింపజేశాడట.

ఈ విషయాన్ని తన కొత్త చిత్రం ‘బింబిసార’ ప్రమోషన్లలో భాగంగా ‘మనసులో మాట’ పేరుతో రిలీజ్ చేసిన ఒక వీడియోలో కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. ఇందులో ఈ నందమూరి హీరో తన సినీ ప్రయాణం గురించి వివరించాడు.

‘బాల గోపాలుడు’ చిత్రంతో తాను సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ.. ఆ తర్వాత బాల నటుడిగా మరో సినిమా చేయలేదని, పూర్తిగా చదువు మీదే దృష్టిపెట్టాని.. చదువు పూర్తి చేశాకే ఇటు వైపు అడుగులు వేశానని కళ్యాణ్ రామ్ తెలిపాడు. రామోజీ రావు నిర్మాణంలో కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా తాను నటించిన ‘తొలి చూపులోనే’ ఆశించిన ఫలితాన్నివ్వలేదని, రెండో చిత్రం కూడా నిరాశ పరిచిందని, ఆ సమయంలో తన గురించి అందరూ రకరకాలుగా మాట్లాడారని, అప్పుడు తనను తాను నిరూపించుకోవాలన కసి తనలో పెరిగిందని, ఆ క్రమంలో ‘అతనొక్కడే’ చిత్రాన్ని సొంత బేనర్లో నిర్మించానని, అది ఘనవిజయం సాధించి తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిందని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

‘అతనొక్కడే’ దగ్గర్నుంచి తాను చాలా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని.. హాలీవుడ్లో వచ్చే త్రీడీ సినిమాల స్ఫూర్తితో ఏదైనా కొత్తగా చేయాలని ‘ఓం’ సినిమా చేస్తే అది కూడా తీవ్ర నిరాశకు గురి చేసిందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. కొవిడ్ పాండమిక్ తర్వాత ప్రేక్షకులు అసలు థియేటర్లకు వస్తారో రారో అన్న సందేహాలు కలిగిన టైంలో ‘ఆర్ఆర్ఆర్’ ఆ సందేహాల్ని పటాపంచలు చేసిందని.. ఇందులో ఎన్టీఆర్, చరణ్ అద్భుతంగా నటించారని కళ్యాణ్ రామ్ అన్నాడు. ‘బింబిసార’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అతనన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

12 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago