ఏపీ సీఎం జగన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన వరద ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇళ్లకు వెళ్లి బాధితులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలివిడిగా వ్యవహరించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఎత్తుకున్న తన చిన్నారిని సీఎం జగన్ ముద్దాడారు. అక్కడితో ఆగకుండా.. ఆయన ఆ చిన్నారిని తన ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. అలానే ఉండి.. ఇక్కడి సమస్యలపై స్పందించారు.
అయితే.. చిన్నారి ఏం చేశాడంటే.. సీఎం జగన్ జేబును తడిమాడు. ఆ చిన్నారి చేతికి జగన్ జేబులో పెన్ను కనిపించింది. ఇంకే ముంది.. చిన్నారి.. దానిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ముందు చేతికి అందకపోయినా.. తర్వాత.. రెండు చేతులతోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో దీనిని గమనించిన చిన్నారి తల్లి.. అతడిని వారించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి సీఎం జగన్ జేబులో ఉన్న పెన్నును లాగేయడంతో అది కాస్తా కింద పడింది.
దీంతో పక్కనే ఉన్న అధికారులు.. వెంటనే స్పందించి.. సదరు పెన్నును తీసి.. సీఎంకు అందించారు. ఆ పెన్నును సీఎం జగన్ ఆ చిన్నారికే బహూకరించారు. ఇదీ.. స్టోరీ.. అయితే.. ఇందులో వింతేముంది? అంటున్నారా? కట్ చేస్తే.. సీఎం జగన్ వాడే ఆ పెన్ను ఖరీదు.. ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత.. సదరు పెన్నుపై నెటిజన్లు జోరుగా సెర్చ్ చేశారు.
ఈ క్రమంలో ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్లో విక్రయానికి ఉంచిన ఆపెన్ను.. మౌంట్ బ్లాంక్-145 మేస్టర్ స్టిక్ క్లాసిక్ గోల్డ్ ఫౌంటెన్ పెన్. దీని ఖరీదు అక్షరాలా 69,999(అది కూడా డిస్కౌంట్తో) రూపాయలు. దీని అసలు ఖరీదు 75999 రూపాయలు. బంగారు పాళీతో తయారు చేసిన ఈ పెన్నును సీఎం వినియోగిస్తారని తెలుసుకుని.. నెటిజన్లు అవాక్కయ్యారు. ఇక, ఈ పెన్నును సొంతం చేసుకున్న చిన్నారి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ.. సంగతి!!
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…