ఏపీ సీఎం జగన్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన వరద ప్రభావితం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇళ్లకు వెళ్లి బాధితులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలివిడిగా వ్యవహరించి.. ఓదార్చారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఎత్తుకున్న తన చిన్నారిని సీఎం జగన్ ముద్దాడారు. అక్కడితో ఆగకుండా.. ఆయన ఆ చిన్నారిని తన ఒళ్లోకి తీసుకుని ఎత్తుకున్నారు. చాలా సేపు ఎత్తుకున్నారు. అలానే ఉండి.. ఇక్కడి సమస్యలపై స్పందించారు.
అయితే.. చిన్నారి ఏం చేశాడంటే.. సీఎం జగన్ జేబును తడిమాడు. ఆ చిన్నారి చేతికి జగన్ జేబులో పెన్ను కనిపించింది. ఇంకే ముంది.. చిన్నారి.. దానిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. ముందు చేతికి అందకపోయినా.. తర్వాత.. రెండు చేతులతోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో దీనిని గమనించిన చిన్నారి తల్లి.. అతడిని వారించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి సీఎం జగన్ జేబులో ఉన్న పెన్నును లాగేయడంతో అది కాస్తా కింద పడింది.
దీంతో పక్కనే ఉన్న అధికారులు.. వెంటనే స్పందించి.. సదరు పెన్నును తీసి.. సీఎంకు అందించారు. ఆ పెన్నును సీఎం జగన్ ఆ చిన్నారికే బహూకరించారు. ఇదీ.. స్టోరీ.. అయితే.. ఇందులో వింతేముంది? అంటున్నారా? కట్ చేస్తే.. సీఎం జగన్ వాడే ఆ పెన్ను ఖరీదు.. ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత.. సదరు పెన్నుపై నెటిజన్లు జోరుగా సెర్చ్ చేశారు.
ఈ క్రమంలో ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్లో విక్రయానికి ఉంచిన ఆపెన్ను.. మౌంట్ బ్లాంక్-145 మేస్టర్ స్టిక్ క్లాసిక్ గోల్డ్ ఫౌంటెన్ పెన్. దీని ఖరీదు అక్షరాలా 69,999(అది కూడా డిస్కౌంట్తో) రూపాయలు. దీని అసలు ఖరీదు 75999 రూపాయలు. బంగారు పాళీతో తయారు చేసిన ఈ పెన్నును సీఎం వినియోగిస్తారని తెలుసుకుని.. నెటిజన్లు అవాక్కయ్యారు. ఇక, ఈ పెన్నును సొంతం చేసుకున్న చిన్నారి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదీ.. సంగతి!!
This post was last modified on July 26, 2022 11:00 pm
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…