ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ముందుగా దర్శకత్వ శాఖలో పని చేసి.. ఆ తర్వాత అనుకోకుండా హీరోగా అరంగేట్రం చేసి.. ‘అష్టాచెమ్మా’తో తొలి ప్రయత్నంలోనే అందరినీ ఆకట్టుకుని.. ఆ తర్వాత కొంతకాలం నెమ్మదిగా అడుగులు.. ఆపై సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు నాని. కేవలం తెరపై బాగా నటించడం మాత్రమే కాదు.. బయట బాగా మాట్లాడడం, చక్కటి నడవడిక ద్వారా నాని తన స్థాయిని పెంచుకున్నాడు.
టాప్ స్టార్లు అయ్యుండి కొంతమంది కొన్ని అంశాలపై మాట్లాడాల్సిన సమయంలోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల సమస్య మీద ఓపెన్గా తన అభిప్రాయం చెప్పడం ద్వారా హీరో అయ్యాడు నాని. ఈ విషయాన్ని కావాలని వివాదాస్పదంగా మార్చిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ నాని సరిగ్గానే మాట్లాడాడన్నది మెజారిటీ అభిప్రాయం. ఇప్పుడు ఈ విషయంపై నాని క్లారిటీ ఇచ్చాడు.
దీంతో పాటుగా నాని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మధ్య అందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ తమ సినిమాల గురించి ఊదరగొట్టేస్తుండటం గురించి నాని తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఊరికే పోస్టర్ల మీద పాన్ ఇండియా ఫిలిం అని వేసుకుంటే.. బయట ప్రచారం చేసుకుంటే.. అవి పాన్ ఇండియా సినిమాలు అయిపోవని నాని అన్నాడు.
‘పుష్ప’ సినిమా కథ చిత్తూరు ప్రాంతంలో ఉండే శేషాచలం అడవుల చుట్టూ, ఇక్కడి మనుషుల చుట్టూ తిరుగుతుందని.. కానీ ఆ సినిమాను దేశమంతా ఆదరించిందని.. దీన్ని బట్టి ఏ ప్రేక్షకులకైనా కనెక్ట్ అయ్యే ఎమోషన్ సినిమాలో ఉండడం కీలకమని.. అప్పుడు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని.. అంతే తప్ప ఎవరికి వాళ్లు తమది పాన్ ఇండియా సినిమా అనేస్తే.. పోస్టర్ల మీద వేసేస్తే లాభం లేదని నాని స్పష్టం చేశాడు. కాబట్టి అందరూ కంటెంట్ మీద దృష్టిపెట్టాలని.. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఆడుతాయని నాని అన్నాడు.
This post was last modified on June 7, 2022 2:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…