మూడున్నరేళ్ల కిందట సంచలన విజయం సాధించిన ‘కేజీఎఫ్-చాప్టర్ 1’కు కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్- చాప్టర్ 2’ మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిస్తుందని అందరికీ తెలుసు. వివిధ భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూసినపుడే ఓపెనింగ్స్ మీద ఒక అంచనా ఏర్పడింది. కానీ ఆ అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోందా చిత్రం. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరడం అసాధారణమైన విషయం.
రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు దీటుగా ఈ సినిమా వసూళ్లు సాధించడం షాకింగే. తొలి నాలుగు రోజుల వ్యవధిలో ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ రూ.538 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడితే.. ‘కేజీఎఫ్-2’ ఇన్ని రోజుల్లో రూ.540 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. కాకపోతే ‘కేజీఎఫ్-2’ గురువారమే రిలీజ్ కావడం వల్ల నాలుగో రోజు ఆదివారం అయింది. ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం రిలీజ్ కావడం వల్ల నాలుగో రోజు సోమవారం వచ్చింది. అయినా సరే.. రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు.. ప్రశాంత్ నీల్-యశ్ సినిమా దీటుగా నిలబడటం మామూలు విషయం కాదు.
రిలీజ్ రోజు నుంచి ప్రతి రోజూ ఈ చిత్రం రూ.100 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ‘కేజీఎఫ్-2’ వసూళ్లు ఇంత భారీగా ఉండటంతో హిందీ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు హిందీలో ఓ మోస్తరుగానే వచ్చాయి కలెక్షన్లు. తొలి నాలుగు రోజుల్లో వంద కోట్లకు అటు ఇటుగా ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ వసూళ్లు రాబడితే.. ‘కేజీఎఫ్-2’ మాత్రం అన్నే రోజుల్లో రూ.190 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును అందుకున్న ఈ చిత్రానికి రెండో వీకెండ్లో అసలు పోటీయే లేని నేపథ్యంలో ఫుల్ రన్లో రూ.1000 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం కూడా కష్టం కాకపోవచ్చు.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…