మూడున్నరేళ్ల కిందట సంచలన విజయం సాధించిన ‘కేజీఎఫ్-చాప్టర్ 1’కు కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్- చాప్టర్ 2’ మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిస్తుందని అందరికీ తెలుసు. వివిధ భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూసినపుడే ఓపెనింగ్స్ మీద ఒక అంచనా ఏర్పడింది. కానీ ఆ అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోందా చిత్రం. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరడం అసాధారణమైన విషయం.
రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు దీటుగా ఈ సినిమా వసూళ్లు సాధించడం షాకింగే. తొలి నాలుగు రోజుల వ్యవధిలో ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ రూ.538 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడితే.. ‘కేజీఎఫ్-2’ ఇన్ని రోజుల్లో రూ.540 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. కాకపోతే ‘కేజీఎఫ్-2’ గురువారమే రిలీజ్ కావడం వల్ల నాలుగో రోజు ఆదివారం అయింది. ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం రిలీజ్ కావడం వల్ల నాలుగో రోజు సోమవారం వచ్చింది. అయినా సరే.. రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు.. ప్రశాంత్ నీల్-యశ్ సినిమా దీటుగా నిలబడటం మామూలు విషయం కాదు.
రిలీజ్ రోజు నుంచి ప్రతి రోజూ ఈ చిత్రం రూ.100 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ‘కేజీఎఫ్-2’ వసూళ్లు ఇంత భారీగా ఉండటంతో హిందీ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు హిందీలో ఓ మోస్తరుగానే వచ్చాయి కలెక్షన్లు. తొలి నాలుగు రోజుల్లో వంద కోట్లకు అటు ఇటుగా ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ వసూళ్లు రాబడితే.. ‘కేజీఎఫ్-2’ మాత్రం అన్నే రోజుల్లో రూ.190 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును అందుకున్న ఈ చిత్రానికి రెండో వీకెండ్లో అసలు పోటీయే లేని నేపథ్యంలో ఫుల్ రన్లో రూ.1000 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం కూడా కష్టం కాకపోవచ్చు.
This post was last modified on April 18, 2022 5:10 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…