జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.. రాజమౌళి ఎవరిని ఎక్కువగా ఎలివేట్ చేసి ఉంటాడు అనే చర్చ నడుస్తూ ఉంది. సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజైనా.. ఇంకేదైనా ప్రోమో వచ్చినా ఈ చర్చ తప్పనిసరి అయిపోతోంది తారక్, చరణ్ అభిమానుల మధ్య. హీరోలిద్దరూ ఎంత సన్నిహితంగా ఉన్నా, ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా మాట్లాడుకున్నా.. అభిమానుల్లో మాత్రం కొట్లాటలు తప్పట్లేదు.
కాగా ప్రమోషన్లలో మీడియాను కలిసినపుడు, ఈవెంట్లకు హాజరైనపుడు దర్శకుడు రాజమౌళికి ఈ విషయంలో ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరెక్కువ, ఎవరు తక్కువ అని అడుగుతుంటే.. అలాంటిదేమీ ఉండదని, ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, బ్యాలెన్స్ పాటించాననే చెబుతూ వస్తున్నాడు. ఆ విషయంలో జక్కన్న కట్టు తప్పుతాడని ఎవరూ అనుకోవడం లేదు.ఐతే సినిమాలో ఏ పాత్ర ఎలా పండుతుంది.. ఏది బాగా హైలైట్ అవుతుందన్నది పక్కన పెడితే.. రాజమౌళికి రామ్, భీమ్ పాత్రల్లో ఏది ఎక్కువ ఇష్టం అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఓ తమిళ ఛానెల్కు ఇంతకుముందే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు జక్కన్న. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో ఏ పాత్ర ఎక్కువ హైలైట్ అవుతుందని అడిగితే.. రెండూ సమాన స్థాయిలో ఉంటాయని, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేదేమీ ఉండదని జక్కన్న స్పష్టం చేశాడు. మరి వ్యక్తిగతంగా మీకు ఇష్టమైన పాత్ర ఏది అంటే.. అల్లూరి సీతారాజు పాత్ర పట్ల తనకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉందని వెల్లడించాడు జక్కన్న.
అది పాత్ర పరంగా వ్యక్తిగతంగా ఉన్న ఇష్టమని కూడా చెప్పాడు. రాజమౌళి అనే కాదు.. బేసిగ్గా తెలుగువారికి అల్లూరి సీతారామరాజు గురించి ఎక్కువ తెలుసు. ఆయన సినిమా సూపర్ హిట్ సినిమా కూడా వచ్చింది. అదొక పాపులర్, హీరోయిక్ క్యారెక్టర్. ఆ రకంగా అందరిలాగే రాజమౌళికి కూడా సీతారామరాజు పాత్ర పట్ల ఆపేక్ష ఉండొచ్చేమో. అంత మాత్రాన సినిమాలో కొమరం భీమ్ పాత్రను తక్కువ చేసినట్లు మాత్రం అనుకోవడానికి వీల్లేదు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…