దిల్ రాజు నిర్మాతగా కంటే కూడా డిస్ట్రిబ్యూటర్గా సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా ఎదిగినప్పటికీ.. ఆయన డిస్ట్రిబ్యూషన్ వదిలి పెట్టలేదు. తెలుగులో రిలీజయ్యే పెద్ద సినిమాల్లో చాలా వరకు దిల్ రాజు ద్వారానే నైజాంలో రిలీజవుతుంటాయి. వైజాగ్లో కూడా ఆయనకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఐతే ఏపీలో టికెట్ల రేట్లు తగ్గడం వల్ల డిస్ట్రిబ్యూషన్ జూదంగా మారిపోయింది.
అందుకే వైజాగ్ను వదిలేసి పూర్తిగా నైజాం మీదే ఫోకస్ పెట్టారాయన. సినిమా పొటెన్షియాలిటీని గుర్తించి కాస్త ఎక్కువ రేటు పెట్టి కూడా హక్కులు సొంతం చేసుకోవడానికి ఆయన వెనుకాడరు. చాలాసార్లు ఆయన జడ్జిమెంట్ సరైన ఫలితాన్నే ఇస్తుంటుంది. గత నెలలో విడుదలైన రెండు భారీ చిత్రాలు అఖండ, పుష్పల మీద ఆయన పెట్టిన పెట్టుబడికి చాలామంది ఆశ్చర్యపోయారు. బాలయ్య చివరి సినిమా ‘రూలర్’ ఓవరాల్ షేర్ రూ.10 కోట్ల మార్కును కూడా అందుకోలేదు.
అలాంటిది నైజాం ఏరియా వరకే రూ.10 కోట్లకు ‘అఖండ’ హక్కులు కొన్నారు రాజు. అలాగే ‘పుష్ప’ మీద ఏకంగా రూ.36 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ రెండు డీల్స్ రిస్క్ అనే అన్నారు చాలామంది. కానీ ‘అఖండ’ సినిమా మీద రాజు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఆదాయం రావడం విశేషం. ఊహించని విధంగా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఇటీవలే హాట్ స్టార్లోకి రావడంతో ‘అఖండ’ బాక్సాఫీస్ రన్ ముగిసింది. ‘అఖండ’ నైజాం ఏరియలో రూ.20 కోట్ల దాకా షేర్ రాబట్టడం గమనార్హం.
బాలయ్యకు బేసిగ్గా నైజాంలో మార్కెట్ వీక్. అలాంటిది ఇక్కడ రూ.20 కోట్ల షేర్ రావడమంటే పెద్ద షాకే. మొత్తంగా ఆ చిత్రం రూ.70 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది. ఇక ‘పుష్ఫ’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే నైజాంలో బ్రేక్ ఈవెన్ కష్టమే అనిపించింది. కానీ డివైడ్ టాక్ను తట్టుకుని ఈ చిత్రం నైజాంలో రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. తొలి వారం తర్వాత ఈ చిత్రానికి పరిస్థితులు బాగా కలిసొచ్చాయి. మొత్తంగా అఖండ, పుష్ప సినిమాల ద్వారా దిల్ రాజు రూ.15 కోట్ల దాకా లాభం అందుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on January 25, 2022 4:34 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…