ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఉన్నంత టాప్ ఫాంలో ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. తన చేతిలో ఉన్న సినిమాల స్కేల్, అతడి సక్సెస్ రేట్, తన పాటలకు వస్తున్న రెస్పాన్స్.. ఇలా ఏ ప్రమాణాల్లో చూసుకున్నా తమన్కు తిరుగులేదు. ఇంతకుముందు తమన్ పని చేయాలని ఆశపడ్డ దర్శకులు, హీరోలు అడిగి మరీ అతణ్ని సంగీత దర్శకుడిగా పెట్టుకుంటున్నారు.
అలా వచ్చిన అవకాశమే.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఖరారైనపుడు తమన్ ఎంత ఎగ్జైట్ అయ్యాడో తెలిసిందే. తాజాగా సింగర్ గీతా మాధురితో కలిసి చేసిన ఒక వీడియో లైవ్ చాట్ సందర్భంగా తమన్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. చరణ్ అభిమానుల్లో ఉత్సాహం తెచ్చే అప్ డేట్స్ ఇచ్చాడు.
చరణ్-శంకర్ సినిమా షూట్ ఆరంభ దశలోనే ఉండగా.. అప్పుడే తమన్ నాలుగు పాటలు పూర్తి చేసేశాడట. మూడు పాటలు కొన్ని రోజుల ముందే పూర్తయ్యాయని.. తాజాగా ఒక పాట రికార్డింగ్ అయిపోయిందని తమన్ వెల్లడించాడు. శంకర్ సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయో తెలిసిందే అని.. ఆయన స్టయిల్కు తన మార్కును జోడించి ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేశానని తమన్ తెలిపాడు. ఈ పాటల్ని శ్రోతలు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. వేరే వ్యక్తులకు గుండె ఒక చోటే ఉంటుందని.. కానీ చరణ్కు మాత్రం ఒళ్లంతా గుండెనే అని తమన్ వ్యాఖ్యానించాడు. తమ కలయికలో వచ్చిన నాయక్, బ్రూస్ లీ సినిమాల కంటే కొత్త సినిమాలో ఆడియో ఇంకా బాగుంటుందని చెప్పాడు. ఈ సందర్భంగా గీతా మాధురి జోక్యం చేసుకుని సినిమాలో ఒక పాట తాను విన్నానని.. ఈ పాట రిలీజైనపుడు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులందరూ తమన్ గురించి మాట్లాడుకుంటారని.. ఆ పాట రిలీజైనపుడు తాను ఇప్పుడు చెప్పిన మాట అందరికీ గుర్తుకొస్తుందని చెబుతూ అంచనాలు పెంచేసింది.
This post was last modified on January 25, 2022 7:31 am
ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. 'ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది.…
2024 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా సంచలన రికార్డులు నమోదు చేసిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇంకా మొదలుకాని…
ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో…
అల్లు అర్జున్ మీద ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా నెగెటివిటీ పెరిగిపోవడాన్ని గమనించే ఉంటారు. కెరీర్ ఆరంభంలో అతణ్ని…
రాజధాని అమరావతి అడుగులు వడివడిగా పడనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రాజధాని నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.…
కొన్నిసార్లు మంచి సినిమాలు థియేటర్లలో ఉన్నా జనాలు సరిగా చూడని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లేమో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా…