Movie News

సత్యరాజ్ పరిస్థితి కాస్త కష్టంగానే..

కరోనా మహమ్మారి గత ెండేళ్లలో ఎంత మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుందో తెలిసిందే. ఆరోగ్యంగా కనిపించి, హుషారుగా ఉన్న వాళ్లు చాలామంది కరోనా సోకి అర్ధంతరంగా తనువు చాలించారు. కొందరు మృత్యువుకు చేరువగా వెళ్లి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా కరోనాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రముఖులెవరైనా వైరస్‌తో ఆసుపత్రి పాలయ్యారంటే అభిమానుల్లో దడ పుడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ కాస్త నయం అనే అంటున్నారు.

కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి కానీ.. వైరస్ తీవ్రత ఆ స్థాయిలో లేదని, విషమంగా ఉన్న కేసులు తక్కువే అని అంటున్నారు. అయినా సరే.. లోలోన భయం మాత్రం కొనసాగుతోంది. మహేష్ బాబు సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ పర్యాయం కరోనా బాధితులుగా మారారు.ఐతే వయసు మీద పడ్డ వాళ్లు కరోనా బారిన పడితేనే కంగారు ఎక్కువగా ఉంటోంది.

తాజాగా తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు. కరోనా సోకాక ముందు ఆయన ఇంట్లోనే ఐసొలేట్ అయ్యి వైద్యుల పర్యవేక్షణలో సాగారు. కానీ రెండు రోజుల ముందు ఆయనకు కరోనా లక్షణాలు తీవ్రం అయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందట. కరోనా లక్షణాలు కొంచెం తీవ్రంగానే ఉండగా.. వైరస్ దాని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట.

దీంతో ఐసీయూలో సత్యరాజ్ కోసం ఒక స్పెషల్ మెడికల్ టీంను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సత్యరాజ్ కుటుంబ సభ్యులు కొంచెం ఆందోళనలోనే ఉన్నారు. అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఐతే సత్యరాజ్‌కు ప్రాణాపాయం అయితే లేదని, కోలుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చని, ఆయన ఆసుపత్రి నుంచి బయటికి వస్తారని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి, నేను శైలజ, బాహుబలి తదితర చిత్రాలతో గత కొన్నేళ్లలో తెలుగులో సత్యరాజ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

This post was last modified on January 10, 2022 3:45 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

1 hour ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

2 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

2 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

3 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

4 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

5 hours ago