Movie News

సత్యరాజ్ పరిస్థితి కాస్త కష్టంగానే..

కరోనా మహమ్మారి గత ెండేళ్లలో ఎంత మంది ప్రముఖులను పొట్టనబెట్టుకుందో తెలిసిందే. ఆరోగ్యంగా కనిపించి, హుషారుగా ఉన్న వాళ్లు చాలామంది కరోనా సోకి అర్ధంతరంగా తనువు చాలించారు. కొందరు మృత్యువుకు చేరువగా వెళ్లి త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా కరోనాను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రముఖులెవరైనా వైరస్‌తో ఆసుపత్రి పాలయ్యారంటే అభిమానుల్లో దడ పుడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ కాస్త నయం అనే అంటున్నారు.

కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి కానీ.. వైరస్ తీవ్రత ఆ స్థాయిలో లేదని, విషమంగా ఉన్న కేసులు తక్కువే అని అంటున్నారు. అయినా సరే.. లోలోన భయం మాత్రం కొనసాగుతోంది. మహేష్ బాబు సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ పర్యాయం కరోనా బాధితులుగా మారారు.ఐతే వయసు మీద పడ్డ వాళ్లు కరోనా బారిన పడితేనే కంగారు ఎక్కువగా ఉంటోంది.

తాజాగా తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రి పాలయ్యారు. కరోనా సోకాక ముందు ఆయన ఇంట్లోనే ఐసొలేట్ అయ్యి వైద్యుల పర్యవేక్షణలో సాగారు. కానీ రెండు రోజుల ముందు ఆయనకు కరోనా లక్షణాలు తీవ్రం అయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ఆయన పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉందట. కరోనా లక్షణాలు కొంచెం తీవ్రంగానే ఉండగా.. వైరస్ దాని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట.

దీంతో ఐసీయూలో సత్యరాజ్ కోసం ఒక స్పెషల్ మెడికల్ టీంను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సత్యరాజ్ కుటుంబ సభ్యులు కొంచెం ఆందోళనలోనే ఉన్నారు. అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఐతే సత్యరాజ్‌కు ప్రాణాపాయం అయితే లేదని, కోలుకోవడానికి కొంచెం సమయం పట్టొచ్చని, ఆయన ఆసుపత్రి నుంచి బయటికి వస్తారని సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి, నేను శైలజ, బాహుబలి తదితర చిత్రాలతో గత కొన్నేళ్లలో తెలుగులో సత్యరాజ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

17 minutes ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

1 hour ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

2 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

2 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

2 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

3 hours ago