Movie News

పునీత్ ఫ్యామిలీని ఇప్పుడు కలవను: AA

కరోనా టైంలో సినీ పరిశ్రమ ఎన్నో విషాదాలను చూసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ఎందరో దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచిపోయారు. అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కరోనాతో సంబంధం లేకుండా కూడా ఎంతోమంది ప్రముఖులు హఠాత్తుగా తుది శ్వాస విడిచారు. అందులో ఇటీవల అత్యంత బాధ పెట్టిన మరణాల్లో పునీత్ రాజ్‌కుమార్‌ది ఒకటి. అజాత శత్రువుగా పేరున్న పునీత్.. తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా మంచి స్థాయిని అందుకున్నాడు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి వ్యక్తిత్వం.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో అతను చేపడుతున్న సేవా కార్యక్రమాలు తన మీద అందరిలోనూ మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. పునీత్ చనిపోయి నెలన్నర దాటుతున్నా ఇంకా అతడి మరణం తాలూకు బాధ నుంచి అభిమానులు బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ అతడి సమాధి సందర్శనకు వేల మంది రోజూ వస్తుండటం తనపై ఉన్న ప్రేమకు నిదర్శనం.పునీత్ మరణించిన సమయంలో, ఆ తర్వాత తెలుగు సినీ తారలు అతడి పట్ల చూపిస్తున్న అభిమానం కన్నడిగులను అమితంగా ఆకట్టుకుంటోంది.

చిరంజీవి సహా పలువురు తెలుగు సినీ ప్రముఖులు పునీత్ చివరి చూపు కోసం వెళ్లారు. ఆ తర్వాత కూడా అతడి కుటుంబాన్ని ఒక్కొక్కరుగా సందర్శిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ సైతం పునీత్ కుటుంబాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం ‘పుష్ప’ ప్రమోషన్ల కోసం బెంగళూరుకు అల్లు అర్జున్ వెళ్లడంతో పునీత్ కుటుంబాన్ని సందర్శిస్తాడని అనుకున్నారు. కానీ అతను అక్కడికి వెళ్లలేదు. ‘పుష్ప’ ప్రెస్ మీట్లో పునీత్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ సమయంలో పునీత్ కుటుంబాన్ని కలవనని కూడా బన్నీ చెప్పడం గమనార్హం.

ఇప్పుడు పునీత్ కుటుంబాన్ని సందర్శిస్తే సినిమా ప్రమోషన్ కోసం వెళ్లి అతడి ఫ్యామిలీని కలిసినట్లు అవుతుందని.. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లనని బన్నీ స్పష్టం చేశాడు. పునీత్ మరణం తననెంతో కలచి వేసిందని.. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఇప్పటిదాకా బెంగళూరుకు రాలేకపోయానని.. సినిమా పనిలో భాగంగా ఇక్కడికి వచ్చి తన కుటుంబాన్ని కలవడం బాగోదని.. అందుకే తర్వాత వేరుగా వచ్చి అతడి కుటుంబాన్ని కలుస్తానని బన్నీ వెల్లడించాడు.

This post was last modified on December 15, 2021 5:40 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago