రెండు నెలల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల ముంగిట వాదోపవాదాలు.. విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచాయి. ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరగాలో అంతా జరిగింది. ఎన్నికల అనంతరం కూడా వివాదం సద్దుమణగలేదు. ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ప్యానెల్తో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతో, వారి పనికి తాము అడ్డం రాబోమంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వివిధ పదవులకు గెలిచిన వాళ్లందరూ రాజీనామా చేయడం తెలిసిందే.
ఐతే ఈ రాజీనామాలను తాము ఆమోదించబోమంటూ ముందు మంచు విష్ణు వర్గం నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు పేర్కొన్నాడు. కానీ తర్వాత దీని గురించి ఎలాంటి చర్చా లేదు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా ఈ రాజీనామాలపై ‘మా’ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఆమోదించేయడం జరిగింది.
దీంతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీకాంత్ సహా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎవ్వరూ ‘మా’ కార్యవర్గంలో లేనట్లే. ఈ విషయంలో మంచు విష్ణు ఆచితూచి వ్యవహరిస్తాడేమో.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడేమో అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అతను చేశడో లేదో తెలియదు. ఇప్పుడిలా రాజీనామాలను ఆమోదించేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీంతో ఇక మంచు విష్ణు నేతృత్వంలోని కార్యవర్గానికి ‘మా’లో ఎదురు లేనట్లే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలతో దాదాపు సగం కార్యవర్గం ఖాళీ అవుతోంది. మరి ఈ పదవులన్నింటినీ ఖాళీగానే ఉంచేస్తారా.. లేక ఎవరినైనా ఆ పదవులకు నామినేట్ చేస్తారా అన్నదే తేలాల్సి ఉంది. ఐతే తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ ‘మా’లో ఏం జరిగినా ప్రశ్నిస్తామని.. ప్రతి నిర్ణయాన్నీ సమీక్షిస్తామని, హామీల అమలు కోసం పట్టుబడతామని ప్రకటించిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on December 12, 2021 6:01 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…