వెంకీ కొత్త కథలను పట్టించుకోవడం లేదా..?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. థియేటర్లకు క్యూ కడుతుంటారు. తాజాగా ఈ హీరో నటించిన ‘నారప్ప’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాపై వెంకీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన పాత్ర కోసం బాగా కష్టపడ్డాడు కూడా. కానీ ఈ సినిమా రిజల్ట్ నిరాశ పరిచింది. ఓటీటీలో రిలీజ్ కావడం కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపించిందని వెంకీ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు దృశ్యం 2′ సినిమాపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

ఎందుకంటే ఈ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. ఓటీటీ రిజల్ట్ పట్ల ఎలాంటి ఆసక్తి లేని వెంకీ.. ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఎఫ్ 3’ సినిమా ఉంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా దాన్ని మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు మరో సినిమాపై ఫోకస్ చేయడకూడదని వెంకీ ఫిక్స్ అయ్యారట. అందుకే తన దగ్గరకు వస్తోన్న కొత్త కథలను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం.

నిజానికి వెంకీ కోసం చాలా కాలంగా ఓ రీమేక్ కథ రెడీగా ఉంది. అదే ‘విక్రమ్ వేద’. ఈ సినిమాపై మొదట్లో వెంకీ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడు తనకు రీమేక్ లు పెద్దగా కలిసి రావడం లేదని ఈ కథను పక్కన పెట్టేశారు. ఇక వెంకీ కోసం తరుణ్ భాస్కర్ ఓ కథ రెడీ చేస్తున్నారు. ఆ కథ సెట్ అయితే వెంకీ సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆ కథ పూర్తి కావడం లేదు. దీంతో కొన్నాళ్లపాటు కొత్త కథల జోలికి పోకూడదని వెంకీ నిర్ణయించుకున్నారు.