మాస్ రాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఎప్పుడో మూడేళ్ల కిందట తొలిసారి వార్తలొచ్చాయి. గత ఏడాది ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కలేదు. కథ విషయంలో ఏమైనా అంగీకారం కుదరలేదా.. వేరే సమస్యలేమైనా ఉన్నాయా తెలియదు కానీ.. ఎంతకీ ఈ సినిమా ముందుకు కదల్లేదు.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాక త్రినాథరావు మూడేళ్ల పాటు ఇంకో సినిమా మొదలుపెట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సమస్యంతా మాస్ రాజా దగ్గరే ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. త్రినాథరావు వేరే సినిమా చూసుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ కూడా జరగలేదు. రవితేజ ఏమో.. ఒకదాని తర్వాత ఒకటి వేరే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ‘క్రాక్’ తర్వాత త్రినాథరావు సినిమా చేయాల్సింది కానీ.. ఖిలాడి మొదలుపెట్టాడు. దాని తర్వాతేమో ‘రామారావు’ వచ్చి పడింది. దీంతో త్రినాథరావు సినిమా మీద అనుమానాలు అంతకంతకూ పెరిగిపోయాయి.
ఐతే ఎట్టకేలకు రవితేజ మనసు కరిగినట్లు సమాచారం. త్రినాథరావు సినిమాను అతి త్వరలో మొదలుపెట్టేస్తున్నాడట. అక్టోబరు 1న ఈ చిత్రానికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రినాథరావు ఆస్థాన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడనే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు అందించాడు. త్రినాథరావు-ప్రసన్న ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. రవితేజ కూడా వినోదాత్మక చిత్రాల్లో బాగా రాణించగలడు. ఈ కలయికలో మంచి ఎంటర్టైనర్ వస్తుందని ఆశించొచ్చు.
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…