మాస్ రాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఎప్పుడో మూడేళ్ల కిందట తొలిసారి వార్తలొచ్చాయి. గత ఏడాది ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కలేదు. కథ విషయంలో ఏమైనా అంగీకారం కుదరలేదా.. వేరే సమస్యలేమైనా ఉన్నాయా తెలియదు కానీ.. ఎంతకీ ఈ సినిమా ముందుకు కదల్లేదు.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాక త్రినాథరావు మూడేళ్ల పాటు ఇంకో సినిమా మొదలుపెట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సమస్యంతా మాస్ రాజా దగ్గరే ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. త్రినాథరావు వేరే సినిమా చూసుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ కూడా జరగలేదు. రవితేజ ఏమో.. ఒకదాని తర్వాత ఒకటి వేరే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ‘క్రాక్’ తర్వాత త్రినాథరావు సినిమా చేయాల్సింది కానీ.. ఖిలాడి మొదలుపెట్టాడు. దాని తర్వాతేమో ‘రామారావు’ వచ్చి పడింది. దీంతో త్రినాథరావు సినిమా మీద అనుమానాలు అంతకంతకూ పెరిగిపోయాయి.
ఐతే ఎట్టకేలకు రవితేజ మనసు కరిగినట్లు సమాచారం. త్రినాథరావు సినిమాను అతి త్వరలో మొదలుపెట్టేస్తున్నాడట. అక్టోబరు 1న ఈ చిత్రానికి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రినాథరావు ఆస్థాన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడనే ఈ చిత్రానికి కూడా స్క్రిప్టు అందించాడు. త్రినాథరావు-ప్రసన్న ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. రవితేజ కూడా వినోదాత్మక చిత్రాల్లో బాగా రాణించగలడు. ఈ కలయికలో మంచి ఎంటర్టైనర్ వస్తుందని ఆశించొచ్చు.
This post was last modified on September 8, 2021 1:41 pm
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…