Political News

ఆమెను దూరం పెట్టి.. ఆయ‌న‌ను ద‌గ్గ‌రికి తీసి!

క‌ర్నూలులో భూమా కుటుంబానికి ఎంతో పేరుంది. రాజ‌కీయంగా చూస్తే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ కుటుంబానికి బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. కానీ ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే టీడీపీ భూమా కుటుంబాన్ని దూరం పెట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. అఖిల ప్రియ‌ను దూరం పెట్టి ఏవీ సుబ్బారెడ్డిని ద‌గ్గ‌రికి తీసేందుకు బాబు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఆళ్ల‌గ‌డ్డ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా నంద్యాల నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌యాంలో క‌ర్నూరులో టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా ఉండేది. కానీ 2017లో ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న కుమార్తె అఖిల ప్రియ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. చంద్ర‌బాబు కూడా ఆమెన మంత్రిని చేశారు. కానీ రాజ‌కీయాల్లో మాత్రం ఆమె త‌న‌దైన ముద్ర చూపించ‌డంలో విఫ‌ల‌మయ్యార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. మంత్రి ప‌ద‌వి ఇచ్చినా ప‌ట్టు పెంచుకోవ‌డంలో ఆమె ఫెయిల్ అయ్యారు. త‌న వారంద‌రినీ దూరం చేసుకున్నారు. భూమా వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వారంతా మెల్ల‌గా ప‌క్క‌కు వెళ్లిపోయారు. కుటుంబంలోనూ పొర‌ప‌చ్చాలు ఉన్న‌యాని తెలిసింది. దీంతో భూమా సోద‌రుల కుమారులు బీజేపీలో చేరిపోయారు.

2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అఖిల‌ప్రియ మ‌రింతగా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ముఖ్యంగా ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ అన్ని విష‌యాల్లోనూ జోక్యం చేసుకుంటుండటంతో భూమా వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. పైగా భూమా నాగిరిడ్డి స‌న్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్య కుట్ర‌కేసు సంచ‌ల‌నంగా మారింది. త‌న బంధువైన మోహ‌న్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం కేసులో ఏవీ సుబ్బారెడ్డిని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది ఎప్ప‌టికైనా అఖిల‌ప్రియ‌కు ఇబ్బందే అని టీడీపీ అధిష్టానం గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు హైదరాబాద్‌లో భూమి విష‌యంలో కిడ్నాక్ కేసు కూడా అఖిల కుటుంబానికి చుట్టుకుంది.

ఈ ప‌రిస్థితుల్లో రాజ‌కీయంగా అఖిల‌ప్రియ ఇక ఎద‌గ‌డం క‌ష్ట‌మ‌ని ఆమెకు ప‌ట్టు దొర‌క‌ద‌ని బాబు భావించిన‌ట్లు సన్నిహితులు చెప్తున్నారు. అందుకే ఆమెను దూరం పెట్టాల‌నుకున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చి ఏవీ సుబ్బారెడ్డికి మ‌రో టికెట్ ఇవ్వాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే సుబ్బారెడ్డికి ప‌రోక్ష సంకేతాలు పంపిన‌ట్లు స‌మాచారం.

This post was last modified on September 8, 2021 1:53 pm

Share
Show comments

Recent Posts

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

5 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

6 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

6 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

6 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago