టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ లో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘జాతిరత్నాలు’ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో నవీన్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. భారీగా అడ్వాన్స్ లు ముట్టజెప్పారు. ఇలా అడ్వాన్ ఇచ్చిన వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఉంది.
నవీన్ పోలిశెట్టితో సినిమా చేయడానికి సదరు సంస్థ రెమ్యునరేషన్ గా రూ.4 కోట్లు ఫిక్స్ చేసింది. నవీన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ‘రంగ్ దే’ సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన ఓ వ్యక్తితో నవీన్ కి కథ చెప్పించారు. కథలో నవీన్ కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పారు. అలా చేసినా కూడా కథ ఓ కొలిక్కి రాలేదని సమాచారం. నవీన్ కి కథ సంతృప్తిగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడట.
అంతేకాదు.. సితార సంస్థ వద్ద తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం నవీన్ పోలిశెట్టి కోసం కథలు వెతుకుతూనే ఉంది. ఈ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ లో కూడా నవీన్ అడ్వాన్స్ తీసుకున్నారు. నిజానికి యూవీ సంస్థలో ఈపాటికే సినిమా మొదలుకావాలి. కానీ ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఎలాంటి ఊసు లేదు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…