టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ లో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘జాతిరత్నాలు’ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో నవీన్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. భారీగా అడ్వాన్స్ లు ముట్టజెప్పారు. ఇలా అడ్వాన్ ఇచ్చిన వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఉంది.
నవీన్ పోలిశెట్టితో సినిమా చేయడానికి సదరు సంస్థ రెమ్యునరేషన్ గా రూ.4 కోట్లు ఫిక్స్ చేసింది. నవీన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ‘రంగ్ దే’ సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన ఓ వ్యక్తితో నవీన్ కి కథ చెప్పించారు. కథలో నవీన్ కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పారు. అలా చేసినా కూడా కథ ఓ కొలిక్కి రాలేదని సమాచారం. నవీన్ కి కథ సంతృప్తిగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడట.
అంతేకాదు.. సితార సంస్థ వద్ద తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం నవీన్ పోలిశెట్టి కోసం కథలు వెతుకుతూనే ఉంది. ఈ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ లో కూడా నవీన్ అడ్వాన్స్ తీసుకున్నారు. నిజానికి యూవీ సంస్థలో ఈపాటికే సినిమా మొదలుకావాలి. కానీ ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఎలాంటి ఊసు లేదు.
This post was last modified on August 31, 2021 5:55 pm
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…