టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ లో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘జాతిరత్నాలు’ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో నవీన్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. భారీగా అడ్వాన్స్ లు ముట్టజెప్పారు. ఇలా అడ్వాన్ ఇచ్చిన వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఉంది.
నవీన్ పోలిశెట్టితో సినిమా చేయడానికి సదరు సంస్థ రెమ్యునరేషన్ గా రూ.4 కోట్లు ఫిక్స్ చేసింది. నవీన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ‘రంగ్ దే’ సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన ఓ వ్యక్తితో నవీన్ కి కథ చెప్పించారు. కథలో నవీన్ కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పారు. అలా చేసినా కూడా కథ ఓ కొలిక్కి రాలేదని సమాచారం. నవీన్ కి కథ సంతృప్తిగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడట.
అంతేకాదు.. సితార సంస్థ వద్ద తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం నవీన్ పోలిశెట్టి కోసం కథలు వెతుకుతూనే ఉంది. ఈ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ లో కూడా నవీన్ అడ్వాన్స్ తీసుకున్నారు. నిజానికి యూవీ సంస్థలో ఈపాటికే సినిమా మొదలుకావాలి. కానీ ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఎలాంటి ఊసు లేదు.
This post was last modified on August 31, 2021 5:55 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…