చ‌ర‌ణ్‌-శంక‌ర్.. క్లారిటీ వ‌చ్చేసింది

రామ్ చ‌ర‌ణ్‌తో త‌మిళ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ చేయ‌బోయే సినిమాకు అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయిన‌ట్లే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌లుపెట్టాల‌నే విష‌యంలో చిత్ర బృందం ఒక అంచ‌నాకు వ‌చ్చేసిన‌ట్లు స‌మాచారం. జులైలోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంద‌ట‌. ఆదివారం జ‌రిగిన కీల‌క ప‌రిణామంతో ఈ విష‌యం ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లే రామ్ చ‌ర‌ణ్‌, దిల్ రాజు క‌లిసి శంక‌ర్‌ను క‌లిసి స‌మావేశం అయ్యారట‌. స్క్రిప్ట్ ఫైన‌ల్ న‌రేషన్ విన‌డంతో పాటు షూటింగ్ విష‌యంలోనూ ముగ్గురూ క‌లిసి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇండియ‌న్-2 వివాదం నుంచి శంక‌ర్ బ‌య‌ట‌ప‌డ్డ నేప‌థ్యంలో వ‌చ్చే నెల నుంచే చ‌ర‌ణ్ సినిమాను మొద‌లుపెట్ట‌డానికి ఆయ‌న సిద్ధంగా ఉన్నార‌ట‌. ఈ మేర‌కు ప్రొడ‌క్ష‌న్ టీం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవ‌డానికి శంక‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల్లోనే ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు, షూటింగ్ అప్‌డేట్‌తో ఒక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. టైటిల్ ప్ర‌క‌టించి షూటింగ్‌కు వెళ్లినా ఆశ్చ‌ర్యం లేదు. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా అద్వానీ క‌థానాయికగా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ విదేశీ భామకు కూడా ఇందులో కీల‌క పాత్ర ఉంద‌ని అంటున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ చిత్రానికి సంగీత బాధ్య‌తలు తీసుకుంటున్నాడు.

శంక‌ర్ త‌ర‌హాలోనే సామాజిక అంశాల‌తో ముడిప‌డ్డ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైట‌న‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీ భాష‌ల్లో పాన్ ఇండియ‌న్ సినిమాగా దీన్ని తీర్చిదిద్ద‌నున్నారు. శంక‌ర్‌కు ఎలాగూ దేశ‌వ్యాప్తంగా పేరుంది. ఆర్ఆర్ఆర్‌తో చ‌ర‌ణ్ సైతం పాన్ ఇండియా స్టార్ కావ‌డం ఖాయం. కాబ‌ట్టి ఈ చిత్రం విడుద‌ల‌య్యే స‌మ‌యానికి హైప్ పీక్స్‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.