టాలీవుడ్లో రాశి ఖన్నా కెరీర్ ఎప్పుడూ ఒక పద్ధతిలో సాగలేదు. ఒక్కోసారి ఆమె మంచి ఊపులో కనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి డౌన్ అవుతుంది. మూడేళ్ల కిందట ‘తొలి ప్రేమ’ సినిమా చూసి ఆమె పెద్ద రేంజికి వెళ్లబోతోందనుకున్నారు. కానీ తర్వాత పరాజయాలు ఆమె కెరీర్ను కిందికి లాగాయి.గత ఏడాది ‘వరల్డ్ ఫేమస్’ లవర్తో డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాక ఆమెకు తెలుగులో ఛాన్సులే రాని పరిస్థితి నెలకొంది. కానీ ఆ గ్యాప్ ఎంతో కాలం కొనసాగలేదు. స్వల్ప వ్యవధిలో రెండు క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుందామె.
విక్రమ్ కుమార్-నాగచైతన్య కలయికలో తెరకెక్కుతున్న ‘థ్యాంక్ యు’తో పాటు మారుతి-గోపీచంద్ల సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది. మరోవైపు హిందీ, తమిళంలోనూ ఆమె మంచి మంచి కాంబినేషన్లలోనే సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలు వెల్లడించింది.
ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్తో రాశి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో తన సినిమా ఒకటి ఖరారైందని రాశి వెల్లడించింది. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుందని చెప్పింది. అలాగే హిందీలో మరో స్టార్తోనూ సినిమా ఓకే అయిందని, దాని గురించి మేకర్సే ప్రకటిస్తారని చెప్పింది. ఇక తమిళంలో ఆమె మూడు సినిమాలు చేస్తుండటం విశేషం.
ప్రస్తుతం కార్తితో పాటు ఆర్యా హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ రాశి నటిస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన ‘తుగ్లక్ దర్బార్’ విడుదలకు సిద్ధమైంది. ఇక మలయాళ సినీ పరిశ్రమలోకి కూడా రాశి అరంగేట్రం చేస్తుండటం విశేషం. అక్కడి అగ్ర కథానాయకుల్లో ఒకడైన పృథ్వీరాజ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోందట రాశి. ఇలా ఒకేసారి నాలుగు ప్రముఖ ఇండస్ట్రీల్లో పని చేస్తున్న అరుదైన కథానాయికల్లో రాశి ఒకరుగా ఉండటం విశేషమే.
This post was last modified on June 10, 2021 5:23 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…