Movie News

షూటింగ్ కి రెడీ అవుతోన్న టాలీవుడ్ స్టార్స్!

లాక్ డౌన్ విధించడంతో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో పదిరోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించడంతో కేసులు మరింత తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో జూన్ రెండు లేదా మూడో వారాల్లో షూటింగ్ మొదలుపెట్టుకోవచ్చని చాలా మంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సిన పర్మిషన్లు వస్తాయని భావిస్తున్నారు. మన స్టార్ హీరోలు కూడా ఎప్పుడు షూటింగ్ మొదలైతే అప్పుడు సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్నారట.

ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాకి సంబంధించి వేసిన సెట్ రెడీగా ఉంది. పది రోజుల పాటు అక్కడ షూటింగ్ నిర్వహిస్తే సినిమా మొత్తం పూర్తవుతుంది. అలానే ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల యూనిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ‘ఆదిపురుష్’ టీమ్ రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలానే మరో భారీ బడ్జెట్ సినిమా ‘ఆచార్య’ షూటింగ్ పది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని దర్శకుడు కొరటాల చెప్పారు.

ఒక్కసారి షూటింగ్ పర్మిషన్లు రాగానే టీమ్ మొత్తం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటారని కొరటాల తెలిపారు. ఇక బాలయ్య.. ‘అఖండ’ సినిమా షూటింగ్ మొదలుపెడితే.. సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్నానని బోయపాటితో చెప్పారట. వీటితో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్, ‘హరిహర వీరమల్లు’ సినిమాలను ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఇంకా మరికొన్ని మీడియం రేంజ్ సినిమాలు కూడా కేసులు తగ్గితే షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.

This post was last modified on June 3, 2021 7:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

4 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

5 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

5 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

5 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

7 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

8 hours ago