టాలీవుడ్ సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది పరిశ్రమకు ఊహించని షాక్. ఎందుకంటే చనిపోవడానికి నాలుగు గంటల ముందు కూడా ఆయన మామూలుగా ఉన్నారు. ఎప్పట్టాగే ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. ఫ్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా పాత పోస్టర్లు, అలాగే ఆ చిత్రంలోని సూపర్ హిట్ పాటల గురించి ఆ పోస్టు పెట్టారు.
బీఏ రాజు ఫాలోవర్లకు చాలా ఇష్టమైన టెంప్లేట్ పోస్టు ఇది. టాలీవుడ్లో ఇంకెవరూ ఈ పని చేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడు 60 ఏళ్ల ముందు విడుదలై సినిమాకు సంబంధించి అప్పటి పోస్టర్లు బయటికి తీసి, ఆ సినిమా విశేషాలు పంచుకోవడం రాజుకే చెల్లు. టాలీవుడ్లో ఆయన దగ్గరున్నంత సినిమా సమాచారం ఇంకెవరి దగ్గరా లేదు అన్నా ఆశ్చర్యం లేదు.
సంతాప సందేశంలో చిరంజీవి అన్నట్లు రాజు సినిమాలకు సంబంధించి ఒక నడిచే ఎన్సైక్లోపీడియా. దాదాపు తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి మెజారిటీ సినిమాల సమాచారం ఆయన దగ్గరుంది. గూగుల్లో వెతికి సమాచారం సేకరించి పోస్ట్ చేయడం కాదు. తన దగ్గరే ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారాయన. పాత సినిమాలకు సంబంధించి అప్పటి పోస్టర్లు, పత్రికా ప్రకటనలన్నీ సేకరించి పెట్టుకున్న రాజు.. వాటిని డిజిటలైజ్ చేయించారు. ఆయా చిత్రాల మేకర్స్ దగ్గర కూడా లేని సమాచారం రాజు దగ్గర ఉండటం విశేషం.
ఏదో సమాచారం చదువుకుని, వెతుక్కుని మాట్లాడటం కాదు.. పాత సినిమాలు వేటి గురించి అడిగినా.. అనర్గళంగా, ఆశువుగా మాట్లాడగలగడం రాజు ప్రత్యేకత. ఈ పరిజ్ఞానంతోనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పాత సినిమాల వార్షికోత్సవాల సమయంలో పోస్టులు పెడుతుంటారు. అవి చూసి ఫాలోవర్లు నోస్టాల్జిక్ ఫీలింగ్లోకి వెళ్తుంటారు. ఇకపై రాజు నుంచి ఇలాంటి పోస్టులు ఉండవు అనే ఆలోచనే ఫాలోవర్లను ఎంతగానో బాధిస్తోంది.
This post was last modified on May 22, 2021 3:10 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…