సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘రాధె’ రెండు రోజుల కిందటే విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసిన మేకర్స్.. ఇండియాలో థియేటర్లు మూత పడి ఉన్న నేపథ్యంలో జీ ఓటీటీలు, డీటీహెచ్ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు. ఐతే ఈ చిత్రానికి నిర్ణయించిన రేటు విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పటిదాకా ఇండియాలో మరే చిత్రానికి లేని విధంగా పే పవర్ వ్యూ రేటు రూ.249 పెట్టారు. ఇంతకుముందు ‘జీ’లోనే విడుదలైన ‘కాలి పీలి’ సినిమాకు రూ.200 రేటు పెట్టారు. ఆ చిన్న సినిమాకే అంత రేటన్నపుడు సల్మాన్ చిత్రానికి రూ.249 ఎక్కువ కాదు అనుకుని ఉండొచ్చు. కానీ ఆ డబ్బులకు తగ్గట్లు ‘రాధె’లో కాస్తయినా విషయం ఉంటే కథ వేరుగా ఉండేది.
సల్మాన్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా ‘రాధె’ను పేర్కొంటున్నారు విమర్శకులు.తొలి రోజు ‘రాధె’ చూద్దామని సల్మాన్ డైహార్డ్ ఫ్యాన్స్ బాగానే ఎగబడ్డారు కానీ.. రెండో రోజు నుంచి అంతా చల్లబడిపోయింది. సినిమాకు కనీస స్పందన కొరవడింది. ఇది రూ.249 పెట్టి ఓటీటీలో చూడాల్సిన సినిమా ఎంతమాత్రం కాదనే సందేశం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇంతలో ‘రాధె’ పైరసీ వెర్షన్లు బయటికి వచ్చేశాయి.
విదేశాల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచే పైరసీ వెర్షన్లు బయటికి వచ్చి ఉండొచ్చు. లేదా ఇండియాలో కొన్ని చోట్ల పరిమితంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అక్కడైనా పైరసీ జరిగి ఉండొచ్చు. ఎలాగైతేనేం రెండో రోజు నుంచే ఇంటర్నెట్లో ‘రాధె’ పైరసీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. సినిమాకు మంచి టాక్ వచ్చి ఉంటే ఓటీటీలోకి వెళ్లి డబ్బులు పెట్టేవాళ్లేమో కానీ.. మామూలు చిత్రం అనేసరికి పైరసీ వైపు చూస్తున్నారు చాలామంది.
తాము చాలా తక్కువ రేటుతో ఓటీటీలో సినిమాను చూపిస్తున్నామని, పైరసీ చేయడం కరెక్ట్ కాదని, దాని వల్ల ప్రమాదంలో పడతారని సల్మాన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. కానీ పెద్దగా ఫలితం లేనట్లే ఉంది. ఓటీటీలో సినిమాకు కనీస స్పందన కరవై, పైరసీ వెర్షన్ హల్చల్ చేస్తోంది. ఈ ప్రవాహంలో సినిమా కొట్టుపోయినట్లే అంటున్నారు.
This post was last modified on May 16, 2021 2:30 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…