Movie News

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తొలిప్రేమలో ఒక సాంగ్ ని రీమిక్స్ చేసి పవన్ మీద చిత్రీకరించామని అన్నారు. ఆ పాట ఏదో నేరుగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్స్, పోస్టర్ లో పవన్ శ్రీలీల ఉన్న స్టిల్ చూస్తుంటే అది ‘ ఈ మనసే నా మనసే పరిగెడుతోంది నీకేసే ” అంటూ దేవా కంపోజింగ్ లో సీతారామశాస్త్రి గారు రాసింది మ్యాచ్ అవుతోంది.

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలో ఓ రేంజ్ బ్లాస్ట్ ఉంటుంది. కొందరు ఫ్యాన్స్ ” ఏమైందో ఏమో ఈ వేళా ” అనుకుంటున్నారు. రీమిక్స్ సాంగ్ ఏదైనా అదొక సెలబ్రేషన్ లా ఉండిపోతుంది. మాములుగా పవన్ సాంగ్స్ ని వేరే హీరోలు వాడుకోవడం గతంలో చాలాసార్లు జరిగింది. గుండె జారీ గల్లంతయ్యిందేలో నితిన్ ఇదే తొలిప్రేమ పాటను పెట్టుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. తన అభిమాన హీరో మీద ప్రేమను ఆ రూపంలో చాటుకున్నాడు.

ఇప్పుడు పవనే తన సాంగ్ రీమిక్స్ కి డాన్స్ చేయడం అంటే అదో స్పెషల్ మూమెంట్ అవుతుంది. రిలీజ్ కు ఇంకో రోజున్నర మాత్రమే టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది. ఓజి తర్వాత వస్తున్న సినిమాగా అంచనాలు దాని స్థాయిలో లేకపోయినా ఒక షో పడ్డాక సీన్ మొత్తం మారిపోతుందని, వైబ్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదకు వస్తుందని నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు హరీష్ శంకర్ పంచుకుంటున్న విషయాలు ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

దురంధర్ రివెంజ్ తో పోటీ ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు. తగినన్ని థియేటర్లు షోలు ఉన్నాయి. బెనిఫిట్ షో నుంచి బాగుందనే మాట ఒక్కటి బయటికి వస్తే చాలు రికార్డుల మోత మొదలవుతుంది. ఇది చాలా కీలకం. ఏపీలో ఉదయం అయిదు గంటల నుంచే షోలు పడనుండగా తెలంగాణ ఫ్యాన్స్ మాత్రం ఏడు దాకా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఎక్స్ ట్రా రేట్లు లేకుండా సాధారణ ధరలకే చూడాల్సి రావడం నైజామ్ మూవీ లవర్స్ కు పెద్ద ఊరట.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

19 seconds ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago