ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తొలిప్రేమలో ఒక సాంగ్ ని రీమిక్స్ చేసి పవన్ మీద చిత్రీకరించామని అన్నారు. ఆ పాట ఏదో నేరుగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్స్, పోస్టర్ లో పవన్ శ్రీలీల ఉన్న స్టిల్ చూస్తుంటే అది ‘ ఈ మనసే నా మనసే పరిగెడుతోంది నీకేసే ” అంటూ దేవా కంపోజింగ్ లో సీతారామశాస్త్రి గారు రాసింది మ్యాచ్ అవుతోంది.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలో ఓ రేంజ్ బ్లాస్ట్ ఉంటుంది. కొందరు ఫ్యాన్స్ ” ఏమైందో ఏమో ఈ వేళా ” అనుకుంటున్నారు. రీమిక్స్ సాంగ్ ఏదైనా అదొక సెలబ్రేషన్ లా ఉండిపోతుంది. మాములుగా పవన్ సాంగ్స్ ని వేరే హీరోలు వాడుకోవడం గతంలో చాలాసార్లు జరిగింది. గుండె జారీ గల్లంతయ్యిందేలో నితిన్ ఇదే తొలిప్రేమ పాటను పెట్టుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. తన అభిమాన హీరో మీద ప్రేమను ఆ రూపంలో చాటుకున్నాడు.
ఇప్పుడు పవనే తన సాంగ్ రీమిక్స్ కి డాన్స్ చేయడం అంటే అదో స్పెషల్ మూమెంట్ అవుతుంది. రిలీజ్ కు ఇంకో రోజున్నర మాత్రమే టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది. ఓజి తర్వాత వస్తున్న సినిమాగా అంచనాలు దాని స్థాయిలో లేకపోయినా ఒక షో పడ్డాక సీన్ మొత్తం మారిపోతుందని, వైబ్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదకు వస్తుందని నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు హరీష్ శంకర్ పంచుకుంటున్న విషయాలు ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
దురంధర్ రివెంజ్ తో పోటీ ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు. తగినన్ని థియేటర్లు షోలు ఉన్నాయి. బెనిఫిట్ షో నుంచి బాగుందనే మాట ఒక్కటి బయటికి వస్తే చాలు రికార్డుల మోత మొదలవుతుంది. ఇది చాలా కీలకం. ఏపీలో ఉదయం అయిదు గంటల నుంచే షోలు పడనుండగా తెలంగాణ ఫ్యాన్స్ మాత్రం ఏడు దాకా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఎక్స్ ట్రా రేట్లు లేకుండా సాధారణ ధరలకే చూడాల్సి రావడం నైజామ్ మూవీ లవర్స్ కు పెద్ద ఊరట.
This post was last modified on March 17, 2026 3:22 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…