ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తొలిప్రేమలో ఒక సాంగ్ ని రీమిక్స్ చేసి పవన్ మీద చిత్రీకరించామని అన్నారు. ఆ పాట ఏదో నేరుగా చెప్పలేదు కానీ ఇన్ సైడ్ సోర్స్, పోస్టర్ లో పవన్ శ్రీలీల ఉన్న స్టిల్ చూస్తుంటే అది ‘ ఈ మనసే నా మనసే పరిగెడుతోంది నీకేసే ” అంటూ దేవా కంపోజింగ్ లో సీతారామశాస్త్రి గారు రాసింది మ్యాచ్ అవుతోంది.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలో ఓ రేంజ్ బ్లాస్ట్ ఉంటుంది. కొందరు ఫ్యాన్స్ ” ఏమైందో ఏమో ఈ వేళా ” అనుకుంటున్నారు. రీమిక్స్ సాంగ్ ఏదైనా అదొక సెలబ్రేషన్ లా ఉండిపోతుంది. మాములుగా పవన్ సాంగ్స్ ని వేరే హీరోలు వాడుకోవడం గతంలో చాలాసార్లు జరిగింది. గుండె జారీ గల్లంతయ్యిందేలో నితిన్ ఇదే తొలిప్రేమ పాటను పెట్టుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. తన అభిమాన హీరో మీద ప్రేమను ఆ రూపంలో చాటుకున్నాడు.
ఇప్పుడు పవనే తన సాంగ్ రీమిక్స్ కి డాన్స్ చేయడం అంటే అదో స్పెషల్ మూమెంట్ అవుతుంది. రిలీజ్ కు ఇంకో రోజున్నర మాత్రమే టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది. ఓజి తర్వాత వస్తున్న సినిమాగా అంచనాలు దాని స్థాయిలో లేకపోయినా ఒక షో పడ్డాక సీన్ మొత్తం మారిపోతుందని, వైబ్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదకు వస్తుందని నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు హరీష్ శంకర్ పంచుకుంటున్న విషయాలు ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
దురంధర్ రివెంజ్ తో పోటీ ఉన్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు. తగినన్ని థియేటర్లు షోలు ఉన్నాయి. బెనిఫిట్ షో నుంచి బాగుందనే మాట ఒక్కటి బయటికి వస్తే చాలు రికార్డుల మోత మొదలవుతుంది. ఇది చాలా కీలకం. ఏపీలో ఉదయం అయిదు గంటల నుంచే షోలు పడనుండగా తెలంగాణ ఫ్యాన్స్ మాత్రం ఏడు దాకా వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఎక్స్ ట్రా రేట్లు లేకుండా సాధారణ ధరలకే చూడాల్సి రావడం నైజామ్ మూవీ లవర్స్ కు పెద్ద ఊరట.
This post was last modified on March 17, 2026 3:22 pm
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…