సోనూ సూద్.. పేరెత్తితే చాలు జనాలకు ఎమోషన్ వచ్చేస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టినపుడు నానా అవస్థలు పడుతున్న వేలాది మంది వలస కార్మికులను తమ గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడతను. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇప్పుడు మరోసారి అల్లాడిపోతున్న దేశానికి అతను అండగా నిలుస్తున్నాడు. నార్త్ సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అతను తన సేవలను విస్తరించాడు.
సెలబ్రెటీలకు సైతం బెడ్స్, ఆక్సిజన్, అత్యవసర మందులు లాంటి వాటి అవసరం పడితే సోనూను ట్యాగ్ చేసి రిక్వెస్ట్లు పెట్టి తమ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారంటే అతను చేస్తున్న సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాను చేస్తున్న మంచి పనుల గురించి సోనూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ మంచి పనుల గురించి ప్రచారం చేసుకునే క్రమంలో సోనూ టీం కొన్నిసార్లు హద్దులు దాటిపోతోంది. సోనూను సూపర్ మ్యాన్ లాగా అభివర్ణిస్తూ జనాలు పెట్టే పోస్టులను, కార్టూన్లను అప్పుడప్పుడూ షేర్ చేస్తుండగా అందులో కొన్ని మరీ అతిగా అనిపిస్తున్నాయి. సోనూ సోషల్ మీడియా పేజీలో ఒక కార్టూన్ షేర్ అయింది. ఈ రోజు ఆక్సిజన్ కొనుగోలు చేసి, 200 మందికి వారి ఇళ్లకే అందించబోతున్నట్లు సోనూ చెబుతుంటే.. భరత మాత అతడికి దండం పెడుతూ.. “నిన్ను చూసి గర్విస్తున్నా పుత్రా . నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నువ్వు నిజ జీవిత హీరోవి” అంటున్నట్లుగా ఆ కార్టూన్ ఉంది.
మరీ భరతమాత సోనూకు దండం పెట్టి నీకు రుణపడి ఉంటా అనడం ఎవరికైనా అతిగా అనిపించకమానదు. దీన్ని స్వయంగా సోనూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడం ఎబ్బెట్టుగానే ఉంది. ఆ పని సోనూనే చేసి ఉండకపోవచ్చు కానీ.. చూసే జనాలకు మాత్రం అతనే ఇది చేసినట్లు కనిపించి దురభిప్రాయం ఏర్పడుతుంది. సోనూ చేస్తున్నది గొప్ప పనే, కానీ ఇలాంటి అతి ప్రచారాలకు వెళ్తే అతడి హుందాతనం దెబ్బ తింటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on May 12, 2021 2:23 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…