సోనూ సూద్.. పేరెత్తితే చాలు జనాలకు ఎమోషన్ వచ్చేస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టినపుడు నానా అవస్థలు పడుతున్న వేలాది మంది వలస కార్మికులను తమ గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడతను. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇప్పుడు మరోసారి అల్లాడిపోతున్న దేశానికి అతను అండగా నిలుస్తున్నాడు. నార్త్ సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అతను తన సేవలను విస్తరించాడు.
సెలబ్రెటీలకు సైతం బెడ్స్, ఆక్సిజన్, అత్యవసర మందులు లాంటి వాటి అవసరం పడితే సోనూను ట్యాగ్ చేసి రిక్వెస్ట్లు పెట్టి తమ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారంటే అతను చేస్తున్న సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాను చేస్తున్న మంచి పనుల గురించి సోనూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్లు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ మంచి పనుల గురించి ప్రచారం చేసుకునే క్రమంలో సోనూ టీం కొన్నిసార్లు హద్దులు దాటిపోతోంది. సోనూను సూపర్ మ్యాన్ లాగా అభివర్ణిస్తూ జనాలు పెట్టే పోస్టులను, కార్టూన్లను అప్పుడప్పుడూ షేర్ చేస్తుండగా అందులో కొన్ని మరీ అతిగా అనిపిస్తున్నాయి. సోనూ సోషల్ మీడియా పేజీలో ఒక కార్టూన్ షేర్ అయింది. ఈ రోజు ఆక్సిజన్ కొనుగోలు చేసి, 200 మందికి వారి ఇళ్లకే అందించబోతున్నట్లు సోనూ చెబుతుంటే.. భరత మాత అతడికి దండం పెడుతూ.. “నిన్ను చూసి గర్విస్తున్నా పుత్రా . నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నువ్వు నిజ జీవిత హీరోవి” అంటున్నట్లుగా ఆ కార్టూన్ ఉంది.
మరీ భరతమాత సోనూకు దండం పెట్టి నీకు రుణపడి ఉంటా అనడం ఎవరికైనా అతిగా అనిపించకమానదు. దీన్ని స్వయంగా సోనూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడం ఎబ్బెట్టుగానే ఉంది. ఆ పని సోనూనే చేసి ఉండకపోవచ్చు కానీ.. చూసే జనాలకు మాత్రం అతనే ఇది చేసినట్లు కనిపించి దురభిప్రాయం ఏర్పడుతుంది. సోనూ చేస్తున్నది గొప్ప పనే, కానీ ఇలాంటి అతి ప్రచారాలకు వెళ్తే అతడి హుందాతనం దెబ్బ తింటుందనడంలో సందేహం లేదు.
This post was last modified on May 12, 2021 2:23 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…