పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల ముంగిట ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఈ సినిమా విడుదల విషయంలో రగడ నడుస్తోంది. పెద్ద హీరోలు నటించిన భారీ సినిమాలకు రిలీజ్ తొలి వారం టికెట్ల రేట్లు పెంచుకోవడం ఏపీ, తెలంగాణలో ముందు నుంచి నడుస్తున్నదే. గతంలో ఆయా సినిమాల వరకు అనుమతులు తెచ్చుకునేవారు. కానీ కరోనా బ్రేక్ తర్వాత మాత్రం కథ మారింది.
ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండా పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీ సర్కారు కూడా ఈ విషయంలో సుముఖంగానే కనిపించింది. గత కొన్ని నెలల్లో విడుదలైన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, రంగ్దె లాంటి పేరున్న సినిమాలకు రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల రేట్లు పెంచుకున్నారు. కానీ ‘వకీల్ సాబ్’కు వచ్చేసరికి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఇబ్బంది పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నేపథ్యంలో ఏపీలో ఎప్పట్లా ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఇబ్బంది లేకపోయింది. ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్లో రేట్లు పెంచే టికెట్లు అమ్మారు. కానీ విడుదల ముందు రోజు మాత్రం ఏపీ రెవెన్యూ అధికారులు ఎగ్జిబిటర్లకు బ్రేకులు వేశారు. రేట్లు పెంచి టికెట్లు అమ్మడానికి వీల్లేదని తేల్చేశారు. ఎవరైనా అలా చేస్తే థియేటర్లు మూసి వేయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అమ్మిన టికెట్ల విషయంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు థియేటర్ల యజమానులు. అలాగే బుకింగ్స్ ఓపెన్ కాని థియేటర్ల విషయంలోనూ సందిగ్ధత నడుస్తోంది.
ఈ విషయమై గందరగోళం నెలకొనడంతో చాలా థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా తెరవలేదు. రిలీజ్ రోజు టికెట్లను ఏ రేట్లతో అమ్మాలో తెలియని అయోమయం నెలకొంది. ఐతే మిగతా సినిమాలకు అనుమతి ఇచ్చి.. ‘వకీల్ సాబ్’ లాంటి భారీ చిత్రానికి ఇలా ఇబ్బందులు సృష్టించడం పట్ల చిత్ర వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ సర్కారు రాజకీయ దురుద్దేశాలతోనే పవన్ సినిమాను ఇలా ఇరుకున పెడుతోందంటూ మెగా అభిమానులు, జనసైనికులు మండిపడుతున్నారు.
This post was last modified on April 9, 2021 7:19 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…