సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్, శ్రీలీల, కీర్తి సురేష్, సాయిపల్లవి ఇలా ఏవేవో పేర్లను పరిశీలించి, ఎవరెవరినో కలిసిన దర్శకుడు వేణు యెల్దండి ఈ కారణంగా అనుకున్న టైంకన్నా షూటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టాల్సి వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ కూడా దేవినే సమకూర్చుకుంటున్నారు. అంచనాలైతే గట్టిగానే ఉన్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎల్లమ్మ ప్రాబ్లమ్ తీరిపోయిందట. హీరోయిన్ గా అనంతిక సనిల్ కుమార్ ని దాదాపుగా లాక్ చేసుకున్నట్టు వినికిడి. ఇటీవలే రోమాంచకంలో కనిపించిన ఈ కేరళ కుట్టికి మార్షల్ ఆర్ట్స్, భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. 8 వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను చేసిన విన్యాసాలు అందరినీ షాక్ కు గురి చేశాయి. అంతకు ముందు మ్యాడ్ లో నటించినప్పటికీ గుర్తింపు రావడానికి కొంచెం టైం పట్టింది. తమిళంలో మూడు సినిమాలు చేసినా పనవ్వలేదు.
ఎల్లమ్మలో ఛాన్స్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే హీరో దేవినే అయినప్పటికీ కథలో కీలక భాగం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందట. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో వేణు యెల్దండి ఇంతగా జల్లెడ పట్టాల్సి వచ్చిందని టాక్. క్లైమాక్స్ లో వీళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు షాక్ కు గురి చేయడం ఖాయమనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. సో ఎలా చూసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంతిక సనిల్ కుమార్ ని తీసుకోవడం ఖచ్చితంగా రైట్ ఛాయసే.
ఇక మిగిలిన విషయాలకు వస్తే ఎల్లమ్మ వచ్చే ఏడాది వేసవి టార్గెట్ గా పెట్టుకుని షూటింగ్ జరుపుకుంటోంది. గ్రామదేవత నేపధ్యమే అయినప్పటికీ మాస్ కు కావాల్సిన అంశాలతో పాటు సెంటిమెంట్, ఎమోషన్ పుష్కలంగా ఉంటాయని తెలిసింది. బలగం తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసిన వేణు ఈసారి భారీ ఖర్చుకు సిద్ధపడ్డారు. కథను విపరీతంగా ఇష్టపడిన దిల్ రాజు అందుకే రిస్క్ గురించి ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. దసరాకు టీజర్ వదిలే ఛాన్స్ ఉందని వినికిడి.
This post was last modified on September 16, 2026 5:28 pm
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…
ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…
తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లి సెటిల్ కావడం అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది ఈ రోజుల్లో. అక్కడ ఏ…
కార్తికేయ గుమ్మకొండ.. ఎనిమిదేళ్ల ముందు టాలీవుడ్లో మార్మోగిన పేరిది. తన తొలి చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’తో ఎలాంటి ప్రభావం…
ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరంలో తొలిసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హౌతీ తిరుగుబాటుదారుల వరస దాడుల…
యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న చర్చగా మారింది. రూ.2 వేలకు…