పుష్ప 2తో మైత్రి మూవీ మేకర్స్ 2024 చివర్లో భారీ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తర్వాత కూడా సంస్థ నుంచి సినిమాలు ఆగలేదు. కానీ తెలుగులో నిర్మించిన సినిమాల లెక్క చూస్తే మాత్రం వరుసగా అనుకున్న ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఇరుముడి రూ.100 కోట్ల మార్క్ దాటి బలంగా నడుస్తుండటంతో, పుష్ప 2 తర్వాత తెలుగులో మైత్రికి దొరికిన పెద్ద సక్సెస్ ఇదే అని అనిపిస్తోంది.
పుష్ప 2 తర్వాత తెలుగులో వచ్చిన రాబిన్హుడ్ మైత్రికి పెద్ద దెబ్బ. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ కావడంతో అంచనాలు ఉన్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఆ తర్వాత వచ్చిన 8 వసంతాలు చిన్న సినిమానే. థియేటర్లలో పెద్దగా ఆడలేదు. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మీద కూడా మైత్రి మంచి ఆశలే పెట్టుకుంది. ఉపేంద్ర కీలక పాత్ర, మంచి పాటలు ఉన్నా బాక్సాఫీస్ దగ్గర సినిమా నిలబడలేదు.
2026లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మరింత పెద్ద ప్రాజెక్ట్. హరీష్ శంకర్ కాంబో కూడా కలిసి రాకపోవడంతో భారీ బిజినెస్ చేసిన సినిమా చివరకు నష్టాల్లో ముగిసింది. అయితే మైత్రికి ఈ మధ్య అసలు హిట్లే లేవని కాదు. తమిళంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు చేశాయి. హిందీలో జాట్ కూడా డీసెంట్ ఫలితం అందుకుంది. అంటే తెలుగులో మాత్రం పుష్ప 2 తర్వాత మరో బలమైన థియేట్రికల్ హిట్ కోసం కొంత గ్యాప్ వచ్చింది.
ఇరుముడి ఆ గ్యాప్ను బాగా ఫిల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రవితేజకు కూడా కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపై మొదట పెద్ద అంచనాలు లేవు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మారింది. ఐదో రోజుకే ఇండియా నెట్ రూ.75 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసింది. టాక్సిక్ వచ్చిన తర్వాత కూడా సినిమా మంచి హోల్డ్ చూపించడం మరింత ప్లస్ అయింది.
This post was last modified on August 27, 2026 11:23 am
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…