ఆగస్ట్ 21 ఇరుముడి విడుదల కానుంది. ముందు నుంచి దీని మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరస ఫ్లాపులతో ఉన్న మాస్ మహారాజా రవితేజకు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గ్రౌండ్ లెవెల్ లో దీనికి భీభత్సమైన బజ్ లేదు. ఉన్నంతలో సాఫ్ట్ కార్నర్ ఏర్పడేందుకు కారణం హీరో వేసుకునే అయ్యప్పస్వామి మాల, టైటిల్ ని బట్టి ఇందులో ఇరుముడి కీలక పాత్ర పోషించిందని జనాలకు అర్థమైపోవడం.
దర్శకుడు శివ నిర్వాణ ఇది గుర్తించి ముందే క్లారిటీ ఇస్తున్నారు. ఇది అయ్యప్ప మీదో లేదా దేవుడి మహత్యం మీదో తీసిన సినిమా కాదని, కథలో భాగంగా రవితేజ నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకుంటాడని, అది కూడా ఒక వ్యసనం తాలూకు పరిణామాలు జీవితాన్ని మార్చిన తర్వాత కూతురి కోసం మాల వేసుకుంటాడని, దానికి ముందు వెనుక జరిగిన సంఘటనలే ఈ కథకు మూలమని చెప్పుకొచ్చారు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ అన్నీ సమపాళ్ళలో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.
ఇది ఒకరకంగా మంచిదే. ఎందుకంటే కేవలం పోస్టర్లు, టైటిల్ ని బట్టి ఇదేదో అయ్యప్ప మహిమలను చాటే సినిమాగా ఎవరైనా భావిస్తే అది వేరే రకమైన అంచనాలను ప్రేరేపిస్తుంది. ఇరుముడి అని పెట్టినా కూడా ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీలో అన్ని అంశాలు మేళవించి శివ నిర్వాణ దీన్ని రూపొందించారు. చాలా కాలంగా స్టార్ హీరోలు ఎవరూ ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్న చిత్రం చేయలేదు. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాలధారణ చేసే భక్తులు లక్షల్లో ఉన్నారు.
సో వాళ్లకు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ఉంటుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చిన ఇరుముడిలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా రవితేజ, పాప మధ్య ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ని చాలా హృద్యంగా డిజైన్ చేశారట. కీలకమైన మల్లెపూల పందిరి సాంగ్ ని సినిమా రిలీజ్ డేట్ దగ్గరలో విడుదల చేయబోతున్నారు. కేవలం వారం గ్యాప్ లో టాక్సిక్ ఉన్న నేపథ్యంలో ఇరుముడి బలంగా నిలబడాలంటే యునానిమస్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్ళాలి.
This post was last modified on August 11, 2026 4:00 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరులో దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా సినిమా నటుడిగా తనదైన సత్తా చాటిన…
పెద్దగా ప్రమోషన్లు చేయకుండా, జనాల్లో అంతగా ఆసక్తి కలిగించకుండా, ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేదా…
స్టార్ హీరోల వారసురాళ్లు స్క్రీన్ మీదకు వచ్చి సక్సెస్ కావడం అరుదు. ముఖ్యంగా మన దక్షిణాదిలో ఒక్క కమల్ హాసన్…
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను…
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ర్యాలీల రచ్చ చూసి రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం…
ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళంటే నమ్మడానికి అసాధ్యం అనిపించినా ఒకదశలో కృష్ణ, చిరంజీవి…