పేరుకు కన్నడ అమ్మాయే కానీ.. దివంగత నటి సౌందర్యను ఎప్పుడూ తెలుగు వాళ్లు పర భాషా కథానాయికగా చూసింది లేదు. ఆమె తన కెరీర్లో అత్యధిక సినిమాలు చేసింది, నటిగా తిరుగులేని స్థాయిని అందుకుంది తెలుగులోనే. తమిళంలో కూడా సౌందర్య ఒక వెలుగు వెలిగింది. కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించింది.
ఎంతో హుందాతనంతో కూడిన పాత్రలతో, అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య.. 2004లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో దుర్మరణం పాలవడం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు గుండెకోతను మిగిల్చింది. కర్ణాటకలో ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం వెళ్తుండగా బెంగళూరు నుంచి వెళ్తున్న విమానం కూలిపోవడంతో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా మరణించారు.
సౌందర్య మరణం గురించి ఇప్పుడు ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయిన సీనియర్ నటి ప్రేమ చెప్పిన షాకింగ్ విషయం ఆమె అభిమానులను మరింత కలచివేస్తోంది. ‘‘సౌందర్య, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం. నేను బెంగళూరులో ఉన్నప్పుడు సౌందర్య వల్ల కరెక్ట్ టైంకి ఫ్లైట్ దొరికిన సందర్భాలు ఉన్నాయి. లొకేషన్లో షూటింగ్ అయిపోగానే ఒకరి రూంకి ఒకరం వెళ్లి ఎంతో సరదాగా గడిపేవాళ్లం. తన ఫ్లైట్ క్రాష్ అయిందన్న వార్త వినగానే షాక్ అయ్యాను.
చూడటానికి వెళ్తే ఆమె బాడీకి తల లేదు. చేతికి ఉన్న వాచ్ చూసి సౌందర్యను గుర్తుపట్టాల్సి వచ్చింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాను. ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా చివరికి మనతో ఏదీ రాదు అని ఆ రోజే నాకు అర్థమైంది’’ అని ప్రేమ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా.. సినిమాల కోసం ఆమె పేరు మార్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఆమె వందల సంఖ్యలో సినిమాలు చేశారు. సావిత్రి తర్వాత నటిగా అంత గొప్ప పేరు, స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటి సౌందర్యనే అని చెప్పాలి. సినిమా కెరీర్ ముగుస్తున్న దశలో, ఆమె రఘు అనే బిజినెస్మ్యాన్ను 2003లో పెళ్లి చేసుకోగా.. తర్వాతి ఏడాదే మరణించింది.
This post was last modified on September 19, 2026 9:50 am
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…