Political News

విపక్షాలకు ‘షా’ అవకాశం ఎందుకిస్తున్నట్లు?

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సీజేపీ, యువకులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, వారిని దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆ టాపిక్ తో పాటు అయోధ్య రామ మందిర విరాళాల అపహరణ అంశాలపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది.

ఈ చర్చకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రావాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే, షా సభకు వస్తారని, విపక్ష నేతలు శాంతంగా ఉండాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మరోవైపు, ఝార్ఘండ్ లో విద్యార్థుల నిరనసపై చర్చించకుండానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోతున్నారని ఎన్డీఏ సభ్యులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల ఎంపీల మధ్య సభ లోపల, వెలుపల మాటల యుద్ధం జరుగుతోంది.

అయితే, ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తిమంతమైన నేతగా చలామణీ అవుతున్న అమిత్ షా సభకు ఎందుకు హాజరు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎటువంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనే షా…ఈ సారి విపక్షాలకు విమర్శించే అవకాశం ఎందుకు ఇచ్చారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే, విద్యార్థుల ఉద్యమం సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలోనే షా మొఖం చాటేస్తున్నారని టాక్ వస్తోంది.

This post was last modified on August 11, 2026 4:02 pm

Share

Recent Posts

ముడి విప్పేయడం మంచిదే స్వామీ

ఆగస్ట్ 21 ఇరుముడి విడుదల కానుంది. ముందు నుంచి దీని మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరస ఫ్లాపులతో…

14 minutes ago

కష్టపడితే సరిపోదు… వేగం కూడా అవసరమే

ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళంటే నమ్మడానికి అసాధ్యం అనిపించినా ఒకదశలో కృష్ణ, చిరంజీవి…

27 minutes ago

పాలిమర్‌ కరెన్సీకి కేంద్రం రెడీ.. మరి పాత నోట్ల సంగతి..?

దేశంలో పాలిమర్‌ (ప్లాస్టిక్‌) కరెన్సీ నోట్ల ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన…

33 minutes ago

ప్రకాష్ రాజ్‌కు పెద్ద ఆయుధాన్నిచ్చారే…

వరుసగా మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు మీద చాలా ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం…

3 hours ago

అన్నా చంపింది మనోళ్లే.. ఆ ఫోన్ కాల్ తో జగన్ ఇరకాటం!

మాచర్లలో వైసీపీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ.. మాజీ సీఎం, వైసీపీ అధినేత…

3 hours ago

కొంచెం చూసుకుని రావయ్యా మేస్త్రి

ఇంకో పదకొండు రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈసారి అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మెగా 158 టీజర్…

5 hours ago