Political News

విపక్షాలకు ‘షా’ అవకాశం ఎందుకిస్తున్నట్లు?

నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు, సీజేపీ, యువకులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, వారిని దారుణంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆ టాపిక్ తో పాటు అయోధ్య రామ మందిర విరాళాల అపహరణ అంశాలపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది.

ఈ చర్చకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రావాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. అయితే, షా సభకు వస్తారని, విపక్ష నేతలు శాంతంగా ఉండాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మరోవైపు, ఝార్ఘండ్ లో విద్యార్థుల నిరనసపై చర్చించకుండానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ నుంచి వెళ్లిపోతున్నారని ఎన్డీఏ సభ్యులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల ఎంపీల మధ్య సభ లోపల, వెలుపల మాటల యుద్ధం జరుగుతోంది.

అయితే, ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తిమంతమైన నేతగా చలామణీ అవుతున్న అమిత్ షా సభకు ఎందుకు హాజరు కావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎటువంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనే షా…ఈ సారి విపక్షాలకు విమర్శించే అవకాశం ఎందుకు ఇచ్చారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే, విద్యార్థుల ఉద్యమం సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలోనే షా మొఖం చాటేస్తున్నారని టాక్ వస్తోంది.

This post was last modified on August 11, 2026 4:02 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

2 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

5 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

8 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

9 hours ago