ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళంటే నమ్మడానికి అసాధ్యం అనిపించినా ఒకదశలో కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు దాన్ని చేసి చూపించారు. కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా పేరుతో రెండేళ్లకు ఒక మూవీ చేస్తే అదే మహా భాగ్యం అనుకునే పరిస్థితి అభిమానుల్లో తలెత్తింది. పోనీ అవేమైనా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయా అంటే అదీ లేదు. మొన్నటికి మొన్న పెద్ది ఏపీ తెలంగాణ మినహాయించి బయట చూపించిన పరాక్రమం అంతంతమాత్రమే.
రామ్ చరణ్ పరిశ్రమకు వచ్చి 19 సంవత్సరాలయ్యింది. ఇప్పటిదాకా చేసింది కేవలం 16 సినిమాలు. వాటిలో ఆచార్య క్యామియో కూడా ఉంది. అంటే సగటున ఏడాదికి ఒక్కటి కూడా రాలేదు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ కు ఎంత విలువైన సమయం బూడిదలో పోసిన పన్నీరయ్యిందో ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేదు. గాయం కారణంగా షూటింగ్ మొదలుకాలేదు కానీ ఆర్సి 17 మొదలుపెట్టాక దర్శకుడు సుకుమార్ ఎంత టైం తీసుకుంటారో ఎవరి ఊహకు అందటం లేదు.
పరిస్థితి ఎలా ఉందంటే ఆరేళ్ళ క్రితం పరిచయమైన కిరణ్ అబ్బవరం అప్పుడే పదిహేను సినిమాలు చేసేశాడని చరణ్ తో పోల్చి మరీ ట్రోల్ చేసే దాకా వెళ్ళింది. ఇది కావాలని చేశారా లేక ఇంకొకటా అనేది పక్కన పెడితే ఈ పోలిక సమంజసం కాదు. ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే చరణ్ సీరియస్ గా విశ్లేషించుకోవాల్సింది ఒకటుంది. డైరెక్టర్ బ్రాండ్ మీద కాకుండా తన ఇమేజ్ కు తగ్గ సబ్జెక్టుని, మార్కెట్ కి అనుగుణంగా వర్కౌట్ అయ్యే కథని ఇస్తున్నారా లేదానేది చెక్ చేసుకోవాలి.
అలా చేసి ఉంటే శంకర్ కు మొహమాటం లేకుండా నో చెప్పేవాడు. బుచ్చిబాబుకి సెకండాఫ్ మార్పులు చేయమని పురమాయించేవాడు. అందరూ రాజమౌళిలు కారు కాబట్టి అవసరమైనప్పుడు సూచనలివ్వడంలో తప్పు లేదు. మన శంకరవరప్రసాద్ గారుకి వెంకటేష్ తో గెస్ట్ రోల్ వేయించమని చిరు చెప్పకపోతే క్లైమాక్స్ చప్పగా ఉండేదేమో. ఈ నెమ్మదితనం చరణ్ ఒక్కడి సమస్య కాదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అందరూ ఈ తాను ముక్కలే. ఉన్నంతలో ప్రభాస్ కొంచెం బెటరని చెప్పాలి.
This post was last modified on August 11, 2026 3:47 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరులో దూసుకుపోతున్నారు. మొన్నటిదాకా సినిమా నటుడిగా తనదైన సత్తా చాటిన…
పెద్దగా ప్రమోషన్లు చేయకుండా, జనాల్లో అంతగా ఆసక్తి కలిగించకుండా, ప్రమోషన్లకు దూరంగా ఉంటూ ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడం లేదా…
స్టార్ హీరోల వారసురాళ్లు స్క్రీన్ మీదకు వచ్చి సక్సెస్ కావడం అరుదు. ముఖ్యంగా మన దక్షిణాదిలో ఒక్క కమల్ హాసన్…
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను…
ఆగస్ట్ 21 ఇరుముడి విడుదల కానుంది. ముందు నుంచి దీని మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వరస ఫ్లాపులతో…
డీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ర్యాలీల రచ్చ చూసి రాష్ట్ర ప్రజల నుంచి ఆగ్రహం…