టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు. ఇటు అభిమానులు, అటు వ్యతిరేకులు.. నాగవంశీని చింటు అని సరదాగా పిలుస్తుంటారు. ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు కూడా బాగా తెలుసు. తనను చింటు పేరుతో చాలామంది ట్రోల్ చేస్తుంటారని తెలిసినా.. నాగవంశీ ఆ విషయాన్ని సీరియస్గా ఏమీ తీసుకోడు.
మాస్ జాతర ఈవెంట్లో, ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో మాస్ రాజా రవితేజ పదే పదే నాగవంశీని.. చింటు చింటు అంటూ ఆటపట్టించడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం స్టేజ్ మీద నాగవంశీని చింటు చింటూ అంటూ సరదాగా కామెంట్ చేయడం విశేషం. నాగ్, నాగవంశీ కలిసి అక్కినేని అఖిల్ను హీరోగా పెట్టి లెనిన్ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా నాగ్.. నాగవంశీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాకో పార్ట్నర్ ఉన్నాడు.. మీరంతా చింటు అన్న అని పిలుస్తారట కదా అతణ్ని.. అంటూ నాగ్ కామెంట్ చేయడంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ కామెంట్ విని నాగవంశీ కూడా నవ్వేశాడు. తర్వాత నాగ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. లెనిన్ సినిమా విషయంలో అఖిల్కు, తనకు ఏ ఇబ్బంది రాకుండా నాగవంశీ అన్నీ సమకూర్చి పెట్టాడని, ఈ సినిమాను పకడ్బందీగా తెరకెక్కేలా చూశాడని అన్నాడు.
చింటు అన్నకు మాస్ పల్స్ బాగా తెలుసని.. అతను ఈ సినిమా మీద ఎంతో నమ్మకంతో ఏపీ అంతటా లెనిన్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడని, దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నాగ్ అన్నాడు. లెనిన్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ధీమాను నాగ్ వ్యక్తం చేశాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కృష్ణ రూపొందించిన లెనిన్ రాబోయే శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
This post was last modified on July 5, 2026 10:27 pm
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…