ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్లో ఆసక్తికర పోరు జరుగుతోంది. నాగబంధం, రావు బహదూర్ లాంటి ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి దిగాయి. మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రాలకు ఓ మోస్తరు టాక్ వచ్చింది. వీకెండ్లో ఈ సినిమాలు బాగానే ఆడతాయని భావిస్తున్నారు.
ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ఆసక్తికర కంటెంట్ అందుబాటులోకి వచ్చింది.
సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించిన సూపర్ సుబ్బును నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయగా.. అమేజాన్ ప్రైమ్లో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ చేసిన ఇసకపట్నం విడుదలైంది. ఐతే ఈ రెండూ పూర్తి భిన్నమైన టాక్ తెచ్చుకున్నాడు. సూపర్ సుబ్బు చూసిన వాళ్లందరూ సూపర్ అంటుండగా.. ఇసకపట్నం చూసిన ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన తొలి తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బునే కావడం విశేషం. సందీప్ కిషన్కు కూడా ఇదే ఫస్ట్ ఒరిజినల్. డీజే టిల్లు దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందించిన ఈ సిరీస్లో సందీప్.. సెక్స్ ఎడుకేషన్ ఆఫీసర్ పాత్ర చేశాడు. సున్నితమైన కథాంశాన్ని మల్లిక్ అండ్ టీం చక్కగా డీల్ చేసింది.
వల్గారిటీకి చిటివ్వకుండా చక్కటి వినడంతో సిరీస్ ను నడిపించింది. కేవలం కామెడీతో సరిపెట్టకుండా ఎమోషన్లను కూడా బాగా పండించారు. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. సందీప్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏడు ఎపిసోడ్లు బోర్ కొట్టకుండా సాగిపోవడంతో సిరీస్ మంచి స్పందన తెచ్చుకుంటుంది.
ఐతే ఐశ్వర్య వెబ్ సిరీస్ విశాఖపట్నం మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తోంది. ఆమె ఇంతకుముందు చేసిన సుళల్ సిరీస్ కు ఇది దరిదాపుల్లో కూడా లేదు. నిఖిల్ తో స్పై లాంటి ఫ్లాప్ మూవీ తీసిన ఎడిటర్ గ్యారీ బి.హెచ్ అనాసక్తికర కథా కథనాలతో ఈ సిరీస్ ను బోరింగ్ గా నడిపించాడు. ఐశ్వర్య, సముద్రఖని పెర్ఫార్మెన్స్ కూడా ఇసకపట్నంను ఎంగేజింగ్ గా మార్చలేకపోయాయి.
This post was last modified on July 4, 2026 12:02 am
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్…
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…