ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి సీజన్లో అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. అమేజాన్ ప్రైమ్కు ఇండియాలో భారీగా సబ్స్క్రిప్షన్లు తెచ్చిపెట్టిన సిరీస్ల్లో ఇది ఒకటి. రా అండ్ రస్టిగ్గా సాగే ఈ సిరీస్కు బూతులు కూడా ఆకర్షణగా మారాయనడంలో సందేహం లేదు. తెలుగులో కూడా ఈ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో మున్నా క్యారెక్టర్, ఆ పాత్రలో దివ్యేందు నటన.. అతడి బూతులు సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్గా కనిపిస్తుంటాయి.
ఈ సిరీస్తో వచ్చి పాపులారిటీతోనే దివ్యేందు ‘పెద్ది’, ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఐతే ‘మీర్జాపూర్’ తర్వాతి రెండు సీజన్లు.. తొలి సీజన్ స్థాయిలో అయితే ఆదరణ పొందలేకపోయాయి. అయినా అవే పాత్రలతో ఇప్పుడు సినిమా కూడా రెడీ చేసేశారు. దీన్ని కూడా అమేజాన్ ప్రైమే నిర్మించడం విశేషం. దీని ట్రైటర్ తాజాగా లాంచ్ చేశారు.
‘మీర్జాపూర్’లో కీలక పాత్రలు కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డు పండిట్ (అలీ ఫజల్), మున్నా (దివ్యేందు), బీనా (రసిక దుగ్గల్), స్వీటీ (శ్రియ పిల్గావోంకర్), గోలు (శ్వేత పండిట్).. ఇలా సిరీస్లోని ముఖ్య పాత్రలు, వాటి నటులను సినిమాలోనూ కొనసాగించారు. కానీ తొలి సీజన్కు ఆకర్షణగా నిలిచిన బబ్లు పాత్రలో నటుడిని మాత్రం మార్చేశారు. విక్రాంత్ మాస్సే బదులు ఎవరో కొత్త నటుడిని పెట్టారు. అది నిరాశ కలిగించే విషయం.
‘మీర్జాపూర్’ తొలి సీజన్ చేసే సమయానికి విక్రాంత్ చిన్న స్థాయి నటుడే. కానీ తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. ట్వల్త్ ఫెయిల్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగానూ నిలిచాడు. విక్రాంత్ లేకపోవడం సంగతి అలా ఉంచితే.. ‘మీర్జాపూర్’ టీవీ సిరీస్తో పోలిస్తే బిగ్ స్క్రీన్కు అవసరమైన భారీతనం.. కమర్షియల్ హంగులు మాత్రం కనిపిస్తున్నాయి.
కొత్తగా ఈ సిరీస్లోకి సోనాల్ చౌహాన్ను తీసుకొచ్చారు. ఆమె ట్రైలర్లోనే గ్లామర్ విందు చేసింది. యాక్షన్ ఘట్టాలు భారీగా ఉండబోతున్నాయని.. వయొలెన్స్ బాగానే దట్టించారని అర్థమవుతోంది. కానీ సెన్సార్ చిక్కులు ఉంటాయి కాబట్టి టీవీ సిరీస్లో మాదిరి థియేటర్లలో బూతులు వినిపించే అవకాశం కనిపించడం లేదు. ‘మీర్జాపూర్’ సిరీస్కు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కిన నేపథ్యంలో సెప్టెంబరు 4న పాన్ ఇండియా స్థాయిలో బహు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
This post was last modified on June 25, 2026 4:10 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…