తెలుగులో దసరా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. తెర మీద ఎక్కువగా అదో టైపు పాత్రలు చేసే అతను.. నిజ జీవితంలో కూడా కొంచెం టిపికల్గానే ప్రవర్తిస్తుంటాడు, తన మాట తీరు కూడా కొంచెం తేడాగానే ఉంటుంది. అతడి చుట్టూ అనేక వివాదాలు కూడా ముసురుకున్నాయి. తనపై డ్రగ్స్ ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఇప్పుడతను టాలీవుడ్ మీద వేసిన పంచ్ మాత్రం అందరినీ ఆలోచింపజేసేదే. తెలుగు సినిమాల మేకింగ్లో విపరీతమైన ఆలస్యం జరగడం గురించి అతను వేసిన సెటైర్ చర్చనీయాంశంగా మారింది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో షైన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నుంచి ఒరియా పిల్లా అంటూ సాగే పాటను టీం తాజాగా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో షైన్ పాల్గొన్నాడు.
అతను మాట్లాడుతూ.. కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్ ఎప్పుడు మొదలైందో గుర్తు చేసుకున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో సినిమా సెట్స్ మీదికి వెళ్లిందని.. ఇప్పుడు జూన్ చివరికి వచ్చామని.. అంటే ఏడాదిన్నర పాటు ఈ సినిమా మేకింగ్ జరిగిందని చెబుతూ.. ఇక్కడి జనాలు ఇంతకాలం పాటు ఎలా సినిమా తీస్తారో తనకు అర్థం కాదని నవ్వుతూ వ్యాఖ్యానించాడు షైన్. తాను ఈ ఏడాదిన్నరలో మలయాళంలో 15 సినిమాల దాకా చేశానని.. తన దృష్టిలో అది కూడా చిన్న నంబరే అని అతనన్నాడు.
షైన్ ఇలా మాట్లాడుతున్నపుడు కామ్రేడ్ కళ్యాణ్ టీం సభ్యులంతా గట్టిగా నవ్వారు. నిజానికి ఇది జోక్లా అనిపించినా.. మన ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను షైన్ ఎత్తి చూపాడని చెప్పొచ్చు. మలయాళంలో కంటెంట్ పరంగా ఎంతో క్వాలిటీతో తీసే సినిమాలు నెలా రెండు నెలల్లో పూర్తయిపోతాయి. కానీ మన దగ్గర విషయం అంతంతమాత్రంగా ఉన్న సినిమాలనే ఏళ్ల తరబడి తీస్తుటారు. దీని వల్ల వర్కింగ్ డేస్, బడ్జెట్ విపరీతంగా పెరిగి నిర్మాతలు దారుణంగా దెబ్బ తింటున్నారు. ఇప్పటికైనా వర్కింగ్ డేస్ తగ్గించి, సినిమాలు వేగంగా చేయడం మీద దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం.
This post was last modified on June 20, 2026 7:46 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…