తెలుగులో దసరా సినిమాతో మంచి గుర్తింపు సంపాదించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. తెర మీద ఎక్కువగా అదో టైపు పాత్రలు చేసే అతను.. నిజ జీవితంలో కూడా కొంచెం టిపికల్గానే ప్రవర్తిస్తుంటాడు, తన మాట తీరు కూడా కొంచెం తేడాగానే ఉంటుంది. అతడి చుట్టూ అనేక వివాదాలు కూడా ముసురుకున్నాయి. తనపై డ్రగ్స్ ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
ఐతే ఇప్పుడతను టాలీవుడ్ మీద వేసిన పంచ్ మాత్రం అందరినీ ఆలోచింపజేసేదే. తెలుగు సినిమాల మేకింగ్లో విపరీతమైన ఆలస్యం జరగడం గురించి అతను వేసిన సెటైర్ చర్చనీయాంశంగా మారింది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో షైన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నుంచి ఒరియా పిల్లా అంటూ సాగే పాటను టీం తాజాగా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో షైన్ పాల్గొన్నాడు.
అతను మాట్లాడుతూ.. కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్ ఎప్పుడు మొదలైందో గుర్తు చేసుకున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో సినిమా సెట్స్ మీదికి వెళ్లిందని.. ఇప్పుడు జూన్ చివరికి వచ్చామని.. అంటే ఏడాదిన్నర పాటు ఈ సినిమా మేకింగ్ జరిగిందని చెబుతూ.. ఇక్కడి జనాలు ఇంతకాలం పాటు ఎలా సినిమా తీస్తారో తనకు అర్థం కాదని నవ్వుతూ వ్యాఖ్యానించాడు షైన్. తాను ఈ ఏడాదిన్నరలో మలయాళంలో 15 సినిమాల దాకా చేశానని.. తన దృష్టిలో అది కూడా చిన్న నంబరే అని అతనన్నాడు.
షైన్ ఇలా మాట్లాడుతున్నపుడు కామ్రేడ్ కళ్యాణ్ టీం సభ్యులంతా గట్టిగా నవ్వారు. నిజానికి ఇది జోక్లా అనిపించినా.. మన ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను షైన్ ఎత్తి చూపాడని చెప్పొచ్చు. మలయాళంలో కంటెంట్ పరంగా ఎంతో క్వాలిటీతో తీసే సినిమాలు నెలా రెండు నెలల్లో పూర్తయిపోతాయి. కానీ మన దగ్గర విషయం అంతంతమాత్రంగా ఉన్న సినిమాలనే ఏళ్ల తరబడి తీస్తుటారు. దీని వల్ల వర్కింగ్ డేస్, బడ్జెట్ విపరీతంగా పెరిగి నిర్మాతలు దారుణంగా దెబ్బ తింటున్నారు. ఇప్పటికైనా వర్కింగ్ డేస్ తగ్గించి, సినిమాలు వేగంగా చేయడం మీద దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…