ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్ప దర్శకులుగా దశాబ్దాల పాటు చలామణి అయిన చాలామంది చివర్లో స్థాయికి తగ్గ సినిమాలు చేయలేకపోయిన వాళ్లే. తమ చివరి చిత్రాల విషయంలో వారికి చేదు అనుభవం తప్పలేదు. ఒక హై నోట్తో కెరీర్ను ముగించిన దర్శకులు అరుదుగా కనిపిస్తారు.
దర్శకరత్న దాసరి నారాయణరావునే తీసుకుంటే.. ఆయన చివరగా నందమూరి బాలకృష్ణతో తీసిన ‘పరమ వీర చక్ర’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అంతకుముందు కూడా దాసరికి ఫ్లాపులున్నాయి. కానీ చివరి సినిమా మరీ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇక రాఘవేంద్రరావు విషయానికి వస్తే.. ఆయన ఆఖరి చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’కు మంచి టాకే వచ్చినా.. అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కాకపోతే చివరగా వేంకటేశ్వరస్వామి మీద ఒక భక్తి రస చిత్రం చేశాననే సంతృప్తి మాత్రం ఆయనకుంది.
ఇక మరో లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్కు ‘శుభప్రదం’ రూపంలో చివరి చిత్రం చేదు జ్ఞాపకంగానే మారింది. బాపు సైతం ‘సుందరకాండ’ పేరుతో ఒక పేలవమైన చిత్రాన్ని అందించారు. కోదండరామిరెడ్డి (పున్నమినాగు), కోడిరామకృష్ణ (నాగరాహువు) లాంటి గ్రేట్ డైరెక్టర్స్ సైతం చివరి చిత్రాన్ని చిరస్మరణీయం చేసుకోలేకపోయిన వాళ్లే.
కానీ వీళ్లందరితో పోలిస్తే సింగీతం శ్రీనివాసరావు భిన్నంగా నిలబడ్డారు. ప్రయోగాలకు పెట్టింది పేరైన ఈ లెజెండరీ డైరెక్టర్ చివరగా ‘సింగ్ గీతం’ చిత్రంతో మెప్పించారు. గత వీకెండ్లో రిలీజైన ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది. హిట్ కావడం కంటే కూడా ఈ సినిమా విశిష్ఠత ఏంటంటే.. ఇది కంటెంపరరీ సినిమా అనిపించుకుంది.
యువ దర్శకులకు కూడా సాధ్యం కాని కొత్తదనాన్ని చూపించారు సింగీతం. ఎప్పుడో 40 ఏళ్ళ కిందటే ఆయన ఇంత వైవిధ్యమైన ఆలోచన చేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఈ కథను తెరపై చూసినా అహెడ్ ఆఫ్ టైమ్స్ అనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. 94 ఏళ్ల దర్శకుడు ఇంత వైవిధ్యమైన సినిమా తీయడం అన్నది ఒక చరిత్ర. తెలుగులో ఎందరో దిగ్గజ దర్శకులకు సాధ్యం కాని విధంగా సక్సెస్ ఫుల్, కంటెంపరరీ సినిమా తీయడం ద్వారా తనది వేరే లీగ్ అని చాటారు సింగీతం.
This post was last modified on June 16, 2026 6:45 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…