ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్ప దర్శకులుగా దశాబ్దాల పాటు చలామణి అయిన చాలామంది చివర్లో స్థాయికి తగ్గ సినిమాలు చేయలేకపోయిన వాళ్లే. తమ చివరి చిత్రాల విషయంలో వారికి చేదు అనుభవం తప్పలేదు. ఒక హై నోట్తో కెరీర్ను ముగించిన దర్శకులు అరుదుగా కనిపిస్తారు.
దర్శకరత్న దాసరి నారాయణరావునే తీసుకుంటే.. ఆయన చివరగా నందమూరి బాలకృష్ణతో తీసిన ‘పరమ వీర చక్ర’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అంతకుముందు కూడా దాసరికి ఫ్లాపులున్నాయి. కానీ చివరి సినిమా మరీ చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇక రాఘవేంద్రరావు విషయానికి వస్తే.. ఆయన ఆఖరి చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’కు మంచి టాకే వచ్చినా.. అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కాకపోతే చివరగా వేంకటేశ్వరస్వామి మీద ఒక భక్తి రస చిత్రం చేశాననే సంతృప్తి మాత్రం ఆయనకుంది.
ఇక మరో లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్కు ‘శుభప్రదం’ రూపంలో చివరి చిత్రం చేదు జ్ఞాపకంగానే మారింది. బాపు సైతం ‘సుందరకాండ’ పేరుతో ఒక పేలవమైన చిత్రాన్ని అందించారు. కోదండరామిరెడ్డి (పున్నమినాగు), కోడిరామకృష్ణ (నాగరాహువు) లాంటి గ్రేట్ డైరెక్టర్స్ సైతం చివరి చిత్రాన్ని చిరస్మరణీయం చేసుకోలేకపోయిన వాళ్లే.
కానీ వీళ్లందరితో పోలిస్తే సింగీతం శ్రీనివాసరావు భిన్నంగా నిలబడ్డారు. ప్రయోగాలకు పెట్టింది పేరైన ఈ లెజెండరీ డైరెక్టర్ చివరగా ‘సింగ్ గీతం’ చిత్రంతో మెప్పించారు. గత వీకెండ్లో రిలీజైన ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది. హిట్ కావడం కంటే కూడా ఈ సినిమా విశిష్ఠత ఏంటంటే.. ఇది కంటెంపరరీ సినిమా అనిపించుకుంది.
యువ దర్శకులకు కూడా సాధ్యం కాని కొత్తదనాన్ని చూపించారు సింగీతం. ఎప్పుడో 40 ఏళ్ళ కిందటే ఆయన ఇంత వైవిధ్యమైన ఆలోచన చేశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ఈ కథను తెరపై చూసినా అహెడ్ ఆఫ్ టైమ్స్ అనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. 94 ఏళ్ల దర్శకుడు ఇంత వైవిధ్యమైన సినిమా తీయడం అన్నది ఒక చరిత్ర. తెలుగులో ఎందరో దిగ్గజ దర్శకులకు సాధ్యం కాని విధంగా సక్సెస్ ఫుల్, కంటెంపరరీ సినిమా తీయడం ద్వారా తనది వేరే లీగ్ అని చాటారు సింగీతం.
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…