స్టార్ హీరో హీరోయిన్లు నటించకపోయినా.. పేరున్న దర్శకుడు తీయకపోయినా.. స్టన్నింగ్ విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి అంచనాలు పెంచిన సినిమా.. నాగబంధం. కొన్ని నెలల ముందు రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ చూసి అందరూ షాకైపోయారు. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారుతూ తీసిన సినిమా ఇది. పెదకాపు చిత్రంతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. స్టార్ హీరోలు నటించే ఈవెంట్ ఫిలిమ్స్లో కూడా లేని స్థాయిలో అద్భుతమైన విజువల్స్, ఎఫెక్ట్స్, భారీతనం కనిపించాయి ఈ సినిమా టీజర్లో. సినిమా ఇదే స్థాయిలో ఉంటే ఇదొక సెన్సేషన్ కావడం ఖాయం.
ఐతే నాగబంధం ప్రోమోలు చూసిన చాలామందికి ఇందులో ఒక స్టార్ హీరో నటిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉండేదనే అభిప్రాయం కలిగింది. ఐతే నాగబంధం టీం అలాంటి ప్రయత్నం చేయకపోవడమేమీ లేదట. చాలామంది స్టార్ హీరోల దగ్గరికి ఈ కథ వెళ్లినట్లు నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐతే స్టార్లెవ్వరూ ఈ సినిమాను ఓకే చేయకపోవడంతో కథను నమ్మి విరాట్ కర్ణ హీరోగా ఈ సినిమా చేసినట్లు నిర్మాతలు తెలిపారు. విశేషం ఏంటంటే.. స్టార్ హీరో నటించకపోవడంతో ఈ సినిమాలో మేజర్ బడ్జెట్ అంతా ప్రొడక్షన్కే ఖర్చు చేశామని, అలా బడ్జెట్ రూ.100 కోట్లు అయిందని ప్రొడ్యూసర్స్ చెప్పడం విశేషం. ఇంత బడ్జెట్ పెట్టినా తాము సేఫ్ జోన్లోనే ఉన్నట్లు వారు వెల్లడించారు.
నాగబంధంలో టీజర్, ఇతర ప్రోమోలు చూస్తే భారీగానే ఖర్చయిందని అర్థమవుతుందికానీ.. ఆ ఖర్చు మరీ వంద కోట్లా.. ఒక కొత్త హీరో నటించిన సినిమా మీద నిర్మాతలు ఏ ధైర్యంతో వంద కోట్లు పెట్టారు.. ఆ బడ్జెట్ రికవరీ ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఐతే అమేజాన్ ప్రైమ్ సినిమా చూసి ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బయ్యర్లకు కూడా సినిమా చూపించి మంచి రేట్లకే సినిమాను అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా సరే రూ.100 కోట్ల రికవరీ అంటే అంత తేలికైన విషయం కాదు.
This post was last modified on June 14, 2026 11:49 am
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…