సినీ ప్రియులను అంతులేని విషాదంలో ముంచెత్తుతూ లెజెండరీ దర్శకులు భారతీరాజా కన్నుమూశారు. ఆయన జ్ఞాపకాలలో అభిమానులు గతాన్ని తలుచుకుంటున్నారు. పేరు తెచ్చుకుంది తమిళంలోనే అయినా భారతీరాజాగారికి టాలీవుడ్ తోనూ మంచి కనెక్షన్ ఉంది. ముఖ్యంగా ఆరాధన గురించి చెప్పుకోవాలి. సందీప్ రెడ్డి వంగా ఆఫీసులో చిరంజీవి కోపంగా చూస్తున్న ఫోటో ఒకటి నిలువెత్తు రూపంలో ఉంటుంది. అది భారతీరాజా సృష్టించిన పులిరాజు క్యారెక్టర్.
దీని వెనుక విశేషాలు ఓసారి గుర్తు చేసుకుందాం. 1986లో భారతీరాజా తమిళంలో ‘కడలోర కవితైగల్’ తీశారు. నెగటివ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్న సత్యరాజ్ హీరోగా రేఖ హీరోయిన్ గా తెరకెక్కించారు. బాధ్యత లేకుండా వీధుల్లో తిరిగే ఒక వీధీ రౌడీకి పాఠాలు చెప్పుకునే స్కూల్ టీచర్ కి మధ్య ప్రేమకథని చాలా హృద్యంగా తీశారు. ఇళయరాజా పాటలు ఊరు వాడా మ్రోగిపోయాయి. దెబ్బకు సత్యరాజ్ స్టార్ అయిపోయారు. ఇది చూసిన చిరంజీవికి రీమేక్ చేయాలనే ఆలోచన కలిగింది.
అనుకోవడమే ఆలస్యం అల్లు అరవింద్ ని భారతీరాజా దగ్గరికి పంపించి తెలుగు వెర్షన్ ఆయనే డైరెక్ట్ చేసేలా ఒప్పించారు. సుప్రీమ్ హీరో కాబట్టి ఆయన ఆలోచించలేదు. ఒరిజినల్ వెర్షన్ ని ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా తీయడంతో జనాలకు నచ్చలేదు. తమిళ డబ్బింగ్ లా ఉందని పెదవి విరిచారు. ఖైదీ, దొంగమొగుడు లాంటి అదిరిపోయే మాస్ పాత్రల్లో చూసిన జనాలకు ఆరాధనలో పులిరాజు నచ్చలేదు. ఫలితంగా సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది.
అయినా సరే చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇందులో సుహాసిని హీరోయిన్ గా యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా ఉంటారు. తమిళం ట్యూన్సే తీసుకుని తెలుగులో పాటలు చేసి ఇచ్చారు ఇళయరాజా. ముఖ్యంగా అరె ఏమైంది సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. తర్వాతి రోజులలో భారతీరాజాతో చేయాలని ఎందరో హీరోలు ప్రయత్నించారు కానీ ఆ ఛాన్స్ చిరంజీవికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రమే దొరికింది.
"ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే..…
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో మాత్రమే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా……
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతల బాటలోనే కొనసాగుతున్నాయి. ఇటీవల మెటా వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు…
టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు…
రాష్ట్రంలోని కూటమి సర్కారుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారి గళం నొక్కుతున్నారని.. వారి రౌడీషీటర్ అనే…