పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు కావడం ఖాయమే. ఇక అసలు కుస్తీ సోమవారం అంటే ఈ రోజు నుంచి మొదలుకానుంది. వీక్ డేస్ వచ్చేశాయి. ఇదే వారంలో స్కూళ్లు కాలేజీలు ఓపెన్ చేయబోతున్నారు. ఇంకో నాలుగు రోజులు పిల్లలకు సెలవులున్నాయి కాబట్టి ఆక్యుపెన్సీలు మరీ తీవ్రంగా పడిపోవనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరెంట్ బుకింగ్స్ ఎక్కువగా నమోదు కావొచ్చు.
మిక్స్డ్ టాక్ నుంచి చాలా బాగుంది అనే వరకు పెద్ది గురించిన డిస్కషన్లు సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి. బాలేదని ఎవరూ అనకపోయినా ఆ స్థాయిలో అనుమానం వచ్చేలా కొంత నెగటివ్ క్యాంపైన్ జరిగిన మాట వాస్తవం. ఆ యాంటీ ఫ్యాన్స్ ఎవరు అనేది పక్కనపెడితే ఈ ప్రతికూలతను తట్టుకుని పెద్ది నిలబడాలి. అప్పుడే బ్లాక్ బస్టర్ ముద్ర పడుతుంది. ఇంకా చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. పోటీ లేని వాతావరణాన్ని పెద్ది వీలైనంత ఫుల్లుగా వాడుకోవాలి.
ఒక సమస్య ఏంటంటే పెద్దికి ఉత్తరాదిలో ఆశించినంత వేగంగా ఆదరణ లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటున్నప్పటికీ ఇలాంటివి గతంలో సుల్తాన్, దంగల్ తదితర రూపాల్లో చూసి ఉండటంతో వాళ్ళు మరీ ఎగ్జైట్ అవ్వడం లేదు. నార్త్ అమెరికాలో అయిదు మిలియన్ మార్క్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అంత కంటే ఎక్కువ వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడప్పుడే దొరకదు. ఇంకా వెయిట్ చేయాలి.
ఇప్పుడు పెద్ది పహిల్వాన్ ను అసలైన పరీక్ష మొదలయ్యింది. ఈ వారం కూడా గెలిస్తే ఇంకే టెన్షన్ అక్కర్లేదు. పెంచిన టికెట్ రేట్లు జూన్ 13 దాకా అమలులో ఉంటాయి. కొన్ని ఏరియాల్లో తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఓవరాల్ గా కాదు. ఉత్తరాంధ్రలో చాలా స్ట్రాంగ్ గా ఉన్న పెద్ది అదే దూకుడుని ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగించాలి. రామ్ చరణ్ చెప్పుకున్నట్టు ఇది తన కెరీర్ బెస్ట్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కాకపోతే లెక్కల్లో ఆ మార్క్ చేరుకుంటుందా లేదానేది వేచి చూడాలి.
This post was last modified on June 8, 2026 12:36 pm
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…