బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన హిట్ ఫ్రాంచైజ్ ‘వెల్కమ్ టు ది జంగిల్’ (వెల్కమ్ 3) కోసం చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వందల కోట్ల మార్కెట్ ఉన్న ఈ స్టార్.. 2 కోట్ల కంటే తక్కువ అమౌంట్ ని ఫీజుగా తీసుకున్నాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఒక గట్టి టాక్ నడుస్తోంది. అయితే దీని వెనుక ఒక పెద్ద గేమ్ ప్లాన్ ఉందని సమాచారం. ఫ్రంట్ ఎండ్ ఫీజు బాగా తగ్గించుకున్న అక్షయ్.. బ్యాక్ ఎండ్ లో ఏకంగా 72 శాతం ఐపీఆర్ (IPR) ఆదాయం తీసుకునేలా మాట్లాడుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ ఐపీఆర్ అంటే థియేట్రికల్ రన్ తర్వాత వచ్చే శాటిలైట్, ఓటీటీ, ఆడియో, రీమేక్ హక్కుల ద్వారా వచ్చే డబ్బులు. ఈ హక్కుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో 72 శాతం అక్షయ్ కు, మిగతా 28 శాతం నిర్మాతకు దక్కేలా చర్చలు జరిగాయని ముంబై సర్కిల్స్ లో టాక్. సినిమా హిట్ అయితే అక్షయ్ కు వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది, ఫ్లాప్ అయితే ఆ 1.8 కోట్లతో సరిపెట్టుకోవాలి. ఇదొక హై రిస్క్ మోడల్ అయినా, వెల్కమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ చూస్తే ఇందులో రిస్క్ చాలా తక్కువే అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన పాత సినిమాలు టీవీల్లో పదే పదే ప్రసారం అవుతూ మంచి రేటింగ్స్ తెచ్చుకుంటున్నాయి. ఆ బ్రాండ్ వాల్యూతోనే రిలీజ్ కు ముందే ఈ ప్రాజెక్ట్ కు ఓటీటీ, శాటిలైట్, ఆడియో రూపంలో దాదాపు 120 కోట్ల బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలు నిజమైతే సినిమా థియేటర్లలోకి రాకముందే నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతాడు. ఆ 120 కోట్లలో కూడా అక్షయ్ కి వాటా దక్కుతుందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగానే చర్చ నడుస్తోంది.
ఒకవేళ ఈ టాక్ నిజమైతే నిర్మాతకు ప్రొడక్షన్ బడ్జెట్ పరంగా చాలా టెన్షన్ తప్పుతుంది. హీరోకు ముందే వంద కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన పనిలేకపోవడంతో వడ్డీలకు ఫైనాన్స్ తెచ్చుకునే భారం తగ్గుతుంది. రేపు పొద్దున సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా నిర్మాతకు పెద్దగా నష్టాలు రావు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇద్దరికీ లాభాలే. భవిష్యత్తులో డబ్బుల విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా ముందుగానే పక్కాగా మాట్లాడుకున్నారని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు…
తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్…
అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. కాకపోతే బ్యాడ్ లక్ భుజాన వేసుకుని తిరుగుతోంది. ఆఫర్లకు లోటు…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేనలో ఇప్పుడు ప్రక్షాళన మొదలైందని చెప్పక తప్పదు. తన మాట నమ్మి…
సహజంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దగా చెప్పరు. ఆయన ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా దానిలో…
వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ…