ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరిగా పేరు సంపాదించిన లోక నాయకుడు.. ఆయన నేరుగా తెలుగులో అద్భుతమైన సినిమాలు చేశారు. కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ చిత్రాల జాబితాలో నిలిచే సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, లాంటి సినిమాలు స్ట్రెయిట్ తెలుగువే. ఈ చిత్రాల రూపకర్తలైన కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావులపై కమల్కు అమితమైన అభిమానం ఉంది.
ఈ ఇద్దరి మీద అపారమైన గౌరవ మర్యాదలు చూపిస్తుంటారు కమల్. ఇప్పుడు సింగీతం మీద తన గురుదక్షిన చూపించే అవకాశం కమల్కు లభించింది. 94 ఏళ్ల వయసులోనూ ఎంతో ఓపికతో సింగ్ గీతం సినిమా తీసి చరిత్ర సృష్టించారు సింగీతం. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్లలో కమల్ హాసన్ భాగం కాబోతుండడం విశేషం.
ఆదివారం సింగ్ గీతం ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు కమల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. దర్శకుడు సింగీతంతో పాటు నిర్మాత నాగ్ అశ్విన్ తదితరులు ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. కొన్ని రోజులుగా కమల్ కల్కి-2 షూట్ కోసం హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాను గురువుగా భావించే సింగీతం కోసం ఆయన ఈ వేడుకకు రానున్నాడు.
ఈ చిత్రాన్ని నిర్మించింది కల్కి 2 దర్శకుడైన నాగి కావడంతో మరింత సంతోషంగా కాల్ ఈ ఈవెంట్ కు రావడానికి మరో కారణం. మరి 94 ఏళ్ల యువ దర్శకుడి గురించి లోక నాయకుడు ఏం మాట్లాడతాడు అన్నది ఆసక్తికరం. అసలు ఈ వయసులో ఇంత ఓపికతో ఒక ఫీచర్ ఫిలిం తీయడం గురించి సింగీతం ఏం మాట్లాడతారు అన్నది కూడా ఎంతో క్యూరియాసిటి పెంచేదే. ఈ వేడుకలో కమల్, నాగి.. కల్కి 2కు సంబంధించి ఏమైనా విశేషాలు పంచుకుంటారా అని కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…