రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని వార్తలు రాగానే.. ఆ యుద్ధం రాముడికి, రావణుడికి మధ్య ఉంటుందనే అంచనాతోనే ఉన్నారందరూ. కానీ ఎన్నోసార్లు ఇండియన్ సినిమాల్లో, సీరియళ్లలో చూసిన ఎపిసోడ్ను రాజమౌళి ఎంత కొత్తగా చూపిస్తాడో అనే చర్చ జరిగింది.
కానీ ఇందులో చూపించే యుద్ధం రాముడికి, రావణుడికి కాదని.. రాముడికి, కుంభకర్ణుడికి మధ్య అని తాజాగా ఈ చిత్ర రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అంతేకాక ఈ ఎపిసోడ్ స్పెల్ బౌండ్ అయ్యేలా ఉంటుందని కూడా ఆయన కామెంట్ చేశారు. దీంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రామాయణంలో ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించే కుంభకర్ణుడి క్యారెక్టర్ను రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తాడు.. అతడితో రాముడి యుద్ధాన్ని ఎంత రసవత్తరంగా తెరకెక్కిస్తాడు అని అందరూ క్యూరియాసిటీ ప్రదర్శిస్తున్నారు.
వారణాసిలో కుంభకర్ణుడి పాత్రకు ఇవ్వనున్న ప్రాధాన్యాన్ని బట్టి.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్న విలన్ పాత్ర మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ పాత్ర పేరును కుంభగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఫస్ట్ లుక్లో పృథ్వీరాజ్ చక్రాల కుర్చీకి పరిమితమై కనిపించాడు. రామాయణం కథ తెలిసిన వాళ్లకు కుంభకర్ణుడికి ఏమైందో ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ క్యారెక్టర్ అలా కనిపించడంలో ఆంతర్యం అర్థమవుతుంది.
రాముడు.. కుంభకర్ణుడిని చంపకుండా తన కాళ్లూ చేతులు తెంచేస్తాడు. త్రేతాయుగం నాటి కుంభకర్ణుడి పాత్రకు వర్తమానంలో కుంభ పాత్ర ప్రతీకగా నిలుస్తుందన్నమాట. రాముడి పాత్రకు మహేష్ చేసిన రుద్ర పాత్ర ప్రతిబింబంగా భావించవచ్చు.
కాబట్టి రామాయణం ఎపిసోడ్లో మహేష్ రాముడిగా కనిపిస్తే.. కుంభకర్ణుడిగా కనిపించేది పృథ్వీరాజే అని ఫిక్సయిపోవచ్చు. మొత్తానికి రామాయణ గాథకు, వర్తమానానికి రాజమౌళి భలే లింక్ కలిపినట్లే కనిపిస్తున్నాడు. ఎంతో ఆసక్తి రేకెత్తించేలా ఉన్న ఈ కథను రాజమౌళి తనదైన శైలిలో ప్రెజెంట్ చేస్తే వారణాసి మూవీ బాక్సాఫీస్ పెర్ఫామెన్సుకి ఆకాశమే హద్దన్నమాట.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…