Movie News

శభాష్ కాజల్… భలే సినిమా చేస్తోంది

మంచి సినిమా అంటే బూతులా మారిపోయిన రోజులివి. జనానికి సందేశం అందించే.. సమాజంలోని కఠోర వాస్తవాలను, ప్రమాదకర అంశాలను నిక్కచ్చిగా తెరపై చూపించే సినిమాలు క్రమక్రమంగా బాాగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ జనాలను మేల్కొలిపేలా, సిన్సియర్‌గా సినిమాలు తీసే ఫిలిం మేకర్స్ అప్పుడప్పుడూ తెరపైకి వస్తుంటారు. ‘ది ఇండియా స్టోరీ’ అనే హిందీ సినిమాతో దర్శక నిర్మాతలు అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

‘ది ఇండియా స్టోరీ’ అనే టైటిల్ పెడితే.. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ తరహాలోనే ఇది కూడా ఒక రకం సినిమా అనుకున్నారు చాలామంది. కానీ దీని వ్యవహారం వేరని తాజాగా లాంచ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. దేశంలో అతి పెద్ద సమస్యల్లో ఒకటైన ఆహార కల్తీ మీద సినిమా తీసింది ‘ది ఇండియా స్టోరీ’ టీమ్. షాకింగ్ ట్రూత్ అంటూ.. మనం ఆహారాన్ని కాదు, విషాన్ని తయారు చేస్తున్నాం అంటూ విస్మయపరిచే డేటాను టీజర్లో బయటపెట్టింది టీం.

పాలు సహా మనం తినే ప్రతి ఆహారాన్నీ ఎలా కల్తీ చేస్తున్నారో అనేక పరిశోధనల ఆధారంగా వెల్లడైన డేటాను ఈ టీజర్లో షేర్ చేశారు. కల్తీ, రసాయనాల ప్రభావం వల్ల 20 కోట్ల మంది బాధితులవుతున్నారని.. ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్ బారిన పడుతోందని.. ప్రతి నిమిషానికీ ఒకరిద్దరు చనిపోతున్నారని.. ఇలా ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్‌ను ఈ టీజర్లో షేర్ చేశారు. టీజర్ చూస్తుంటే మనం ఎలాంటి జీవన పరిస్థితుల్లో ఉన్నాామో అని భయం పుడుతుందనడంలో సందేహం లేదు.

ఐతే ఇలాంటి కథాంశంతో డాక్యుమెంటరీలు తీయడం మామూలే కానీ.. ఫీచర్ ఫిలిం తీయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే లీడ్ రోల్స్ చేశారు. ఇలాంటి సినిమా తీస్తున్నందుకు కాజల్ అండ్ టీంను అభినందించాల్సిందే. సాగర్ షిండే ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. చేట్టన్ దర్శకత్వం వహించాడు. జులై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

This post was last modified on June 7, 2026 5:59 pm

Share

Recent Posts

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

1 minute ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

22 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

2 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

3 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

8 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

11 hours ago