Movie News

శభాష్ కాజల్… భలే సినిమా చేస్తోంది

మంచి సినిమా అంటే బూతులా మారిపోయిన రోజులివి. జనానికి సందేశం అందించే.. సమాజంలోని కఠోర వాస్తవాలను, ప్రమాదకర అంశాలను నిక్కచ్చిగా తెరపై చూపించే సినిమాలు క్రమక్రమంగా బాాగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ జనాలను మేల్కొలిపేలా, సిన్సియర్‌గా సినిమాలు తీసే ఫిలిం మేకర్స్ అప్పుడప్పుడూ తెరపైకి వస్తుంటారు. ‘ది ఇండియా స్టోరీ’ అనే హిందీ సినిమాతో దర్శక నిర్మాతలు అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

‘ది ఇండియా స్టోరీ’ అనే టైటిల్ పెడితే.. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ తరహాలోనే ఇది కూడా ఒక రకం సినిమా అనుకున్నారు చాలామంది. కానీ దీని వ్యవహారం వేరని తాజాగా లాంచ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. దేశంలో అతి పెద్ద సమస్యల్లో ఒకటైన ఆహార కల్తీ మీద సినిమా తీసింది ‘ది ఇండియా స్టోరీ’ టీమ్. షాకింగ్ ట్రూత్ అంటూ.. మనం ఆహారాన్ని కాదు, విషాన్ని తయారు చేస్తున్నాం అంటూ విస్మయపరిచే డేటాను టీజర్లో బయటపెట్టింది టీం.

పాలు సహా మనం తినే ప్రతి ఆహారాన్నీ ఎలా కల్తీ చేస్తున్నారో అనేక పరిశోధనల ఆధారంగా వెల్లడైన డేటాను ఈ టీజర్లో షేర్ చేశారు. కల్తీ, రసాయనాల ప్రభావం వల్ల 20 కోట్ల మంది బాధితులవుతున్నారని.. ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్ బారిన పడుతోందని.. ప్రతి నిమిషానికీ ఒకరిద్దరు చనిపోతున్నారని.. ఇలా ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్‌ను ఈ టీజర్లో షేర్ చేశారు. టీజర్ చూస్తుంటే మనం ఎలాంటి జీవన పరిస్థితుల్లో ఉన్నాామో అని భయం పుడుతుందనడంలో సందేహం లేదు.

ఐతే ఇలాంటి కథాంశంతో డాక్యుమెంటరీలు తీయడం మామూలే కానీ.. ఫీచర్ ఫిలిం తీయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే లీడ్ రోల్స్ చేశారు. ఇలాంటి సినిమా తీస్తున్నందుకు కాజల్ అండ్ టీంను అభినందించాల్సిందే. సాగర్ షిండే ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. చేట్టన్ దర్శకత్వం వహించాడు. జులై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kumar

Recent Posts

దత్తుగారికి నిద్ర పట్టనివ్వని మెగా మూవీ

టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

2 hours ago

లవర్ కోసం కోటిన్నర కొట్టేసిన యువతి!

జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…

3 hours ago

కమల్ క్లాసులో ఆలోచించాల్సిన విషయాలు

లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…

4 hours ago

ఇరుముడి వస్తోందంటే… ప్యారడైజ్ రానట్టా

హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…

5 hours ago

పెళ్లి చూపులు మిస్సయితే ఎలా పెద్ది

సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…

5 hours ago

రాము స‌వాల్‌.. కొడాలి మౌనం.. హీటెక్కిన‌ గుడివాడ.. !

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ రాజ‌కీయాలు వేడెక్కాయి. గ‌త రెండేళ్ల పాల న‌లో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…

6 hours ago