ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న ఏడాది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కిష్కిందపురితో డీసెంట్ సక్సెస్ అందుకున్న ఈ మలయాళీ భామ ధృవ్ విక్రమ్ బైసన్ లో మరో వైవిధ్యమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే లాక్ డౌన్ అనే మూవీ చేసింది కానీ పెర్ఫార్మన్స్ పరంగా గుడ్ అనిపించుకున్నా కంటెంట్ వల్ల జనాలకి చేరలేదు. తాజాగా మరీచికతో ఆడియన్స్ ని పలకరించింది.
మరీచికలో అనుపమ పరమేశ్వరన్ ని దర్శకుడు సతీష్ కాశెట్టి రెండు షేడ్స్ లో చూపించారు. సంజయ్ అనే యువకుడిని విపరీతంగా ప్రేమించే వెంకటలక్ష్మి అనే క్యారెక్టర్ ని పళ్లకు క్లిప్స్, కళ్లద్దాలు పెట్టి చూపించిన విధానం డిఫరెంట్ గా అనిపించింది. దీంతో పాటు ఇంకో మోడరన్ లుక్ తో ఒక రకమైన షాక్ ఇచ్చారు. మానసికంగా బాధపడుతున్నట్టు ఒకసారి, అన్నీ తెలిసిన తెలివైనదానిలా మరోసారి కనిపించిన వైనం అభిమానులకు సర్ప్రైజ్ అనే చెప్పాలి.
అప్పుడెప్పుడో విక్రమ్ అపరిచితుడులో చేసిన వేరియేషన్స్ మళ్ళీ ఒక హీరోయిన్ పాత్రలో చూపించడం అరుదు. మరీచిక కమర్షియల్ గా నిలబడుతుందా అంటే ఠక్కున అవునని చెప్పలేం. అనుపమ కోసమే సినిమాకు వెళ్లిన వాళ్ళు తన వరకు అసంతృప్తి చెందడం లేదు. ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా ఇష్టపడే అనుపమకు మరీచిక కీలకమే కానీ ఎందుకనో ప్రమోషన్స్ పరంగా పెద్దగా సౌండ్ చేయలేదు. పరదా తరహాలో హడావిడి కనిపించలేదు.
బ్లాస్ట్ జోన్, దృశ్యం 3, కాటలాన్, వీరభద్రుడు లాంటి డబ్బింగ్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉండటం వల్ల స్ట్రెయిట్ మూవీస్ పరిస్థితి అంతంతమాత్రం ఉంది. ఈ మరీచిక దాన్ని ఉపయోగించుకుంటుందో లేదో కానీ అనుపమ పరమేశ్వరన్ కు మాత్రం మంచి పేరే వచ్చేలా ఉంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చడం విశేషం.
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…