ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే మరోవైపు సీరియస్ పాలిటిక్స్ దిశగా కూడా ఇది పయనిస్తోంది. సోషల్ మీడియాలో పెను దుమారం కూడా సృష్టించింది. తాజాగా తెలంగాణలోని తెలంగాణ థింకర్స్ ఫోరమ్ సోషల్ మీడియాలో కొత్త ఉద్యమానికి తెరదీసింది. ఏపీ నేతల విగ్రహాలను తెలంగాణలో పెడుతున్నారని.. మరి తెలంగాణ నేతల విగ్రహాలనుకూడా ఏపీలో పెట్టాలన్నది ఈ ఫోరమ్ డిమాండ్.
ఇటీవల హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణకు చెందిన వారి విగ్రహాలను ఏపీలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో 350 మంది వరకు ఫాలోవర్లు కొనసాగుతున్నారు. దీనికి పలువురు తెలంగాణ వాదులు, మేధావులు కూడా మద్దతు తెలిపారు. తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు పెడుతున్నప్పుడు.. తెలంగాణకు చెందిన వారి విగ్రహాలను కూడా ఏపీలో ఏర్పాటు చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్.
ఎందుకు?
ఇటీవల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సమయంలో ఆయన విగ్రహ ఏర్పాటును తప్పుబట్టిన వారిపై కొందరు.. ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ సీఎం కాబట్టి విగ్రహ ఏర్పాటు తప్పుకాదు అని సమర్ధించారు. దీంతో ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన.. పీవీ నరసింహారావు(తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు) విగ్రహాన్ని ఏపీలో పెట్టాలన్నదిఇప్పుడు తెరమీదికి వచ్చిన డిమాండ్. అంతేకాదు.. నాడు రజాకార్లపై తిరగబడ్డ చాకలి ఐలమ్మ, రాణీ రుద్రమ వంటి వీరనారుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ సానుకూలం..
ఈ వ్యవహారంపై బీజేపీ సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి రాష్ట్రం కోసం పనిచేసిన వారి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు తాము మద్దతిస్తామని ప్రకటించింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. వారు తెలుగు వారందరి ఉమ్మడి ఆస్తి. అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. ప్రాంతాల పరంగా వేరయ్యామే కాదని.. మనుషులుగా కాదన్నారు. ఏపీ , తెలంగాణలలో జరుగుతున్న కార్యక్రమాలకు అందరూ హాజరవుతున్నారని ఆయన ముక్తాయించారు. ఏపీలో పీవీ విగ్రహం పెట్టినా.. తాము అభ్యంతరం చెప్పబోమన్నారు. మరోవైపు.. సీఎంచంద్రబాబుకు ఫోరమ్ లేఖ రాసింది.
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…