Political News

సోష‌ల్ ఉద్య‌మం: ఏపీలో తెలంగాణ విగ్ర‌హాలు|

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంద‌రికీ తెలిసిందే. బొద్దింక‌ల పార్టీగా ప్రారంభ‌మై.. ఒక వైపు వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే మ‌రోవైపు సీరియ‌స్ పాలిటిక్స్ దిశ‌గా కూడా ఇది ప‌య‌నిస్తోంది. సోష‌ల్ మీడియాలో పెను దుమారం కూడా సృష్టించింది. తాజాగా తెలంగాణ‌లోని తెలంగాణ థింకర్స్ ఫోరమ్ సోష‌ల్ మీడియాలో కొత్త ఉద్య‌మానికి తెర‌దీసింది. ఏపీ నేత‌ల విగ్ర‌హాల‌ను తెలంగాణ‌లో పెడుతున్నార‌ని.. మ‌రి తెలంగాణ నేత‌ల విగ్ర‌హాల‌నుకూడా ఏపీలో పెట్టాల‌న్న‌ది ఈ ఫోర‌మ్ డిమాండ్‌.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా తెలంగాణకు చెందిన వారి విగ్ర‌హాల‌ను ఏపీలోనూ ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ సోష‌ల్ మీడియాలో 350 మంది వ‌ర‌కు ఫాలోవ‌ర్లు కొన‌సాగుతున్నారు. దీనికి పలువురు తెలంగాణ వాదులు, మేధావులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. తెలంగాణ‌లో ఏపీ వారి విగ్ర‌హాలు పెడుతున్న‌ప్పుడు.. తెలంగాణ‌కు చెందిన వారి విగ్ర‌హాల‌ను కూడా ఏపీలో ఏర్పాటు చేయాల‌న్న‌ది వీరి ప్ర‌ధాన డిమాండ్‌.

ఎందుకు?

ఇటీవ‌ల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన స‌మ‌యంలో ఆయ‌న విగ్ర‌హ ఏర్పాటును త‌ప్పుబ‌ట్టిన వారిపై కొంద‌రు.. ఎన్టీఆర్ ఉమ్మ‌డి ఏపీ సీఎం కాబ‌ట్టి విగ్ర‌హ ఏర్పాటు త‌ప్పుకాదు అని స‌మ‌ర్ధించారు. దీంతో ఉమ్మ‌డి ఏపీ సీఎంగా వ్య‌వ‌హ‌రించిన‌.. పీవీ న‌ర‌సింహారావు(తెలంగాణ వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన నాయ‌కుడు) విగ్ర‌హాన్ని ఏపీలో పెట్టాల‌న్న‌దిఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన డిమాండ్‌. అంతేకాదు.. నాడు ర‌జాకార్ల‌పై తిర‌గ‌బ‌డ్డ చాక‌లి ఐల‌మ్మ‌, రాణీ రుద్ర‌మ వంటి వీర‌నారుల విగ్ర‌హాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ సానుకూలం..

ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ సానుకూలంగా స్పందించింది. ఉమ్మ‌డి రాష్ట్రం కోసం ప‌నిచేసిన వారి విగ్ర‌హాలు ఏర్పాటు చేసేందుకు తాము మ‌ద్ద‌తిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. వారు తెలుగు వారందరి ఉమ్మడి ఆస్తి. అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. ప్రాంతాల ప‌రంగా వేర‌య్యామే కాద‌ని.. మ‌నుషులుగా కాద‌న్నారు. ఏపీ , తెలంగాణ‌ల‌లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కు అంద‌రూ హాజ‌ర‌వుతున్నార‌ని ఆయ‌న ముక్తాయించారు. ఏపీలో పీవీ విగ్ర‌హం పెట్టినా.. తాము అభ్యంత‌రం చెప్ప‌బోమ‌న్నారు. మ‌రోవైపు.. సీఎంచంద్ర‌బాబుకు ఫోర‌మ్ లేఖ రాసింది.

This post was last modified on May 31, 2026 10:27 pm

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

1 hour ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

2 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

3 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

4 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

7 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

7 hours ago