ఏమాత్రం సినీ నేపథ్యం లేని నారా కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోహిత్. నారా అంటే పక్కా పొలిటికల్ ఫ్యామిలీ అనే గుర్తింపు ఉండగా.. రోహిత్ మాత్రం సినీ రంగాన్ని ఎంచుకున్నాడు. తొలి చిత్రం ‘బాణం’తోనే తన ప్రతిభను చాటుకున్న అతను.. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలతో మంచి గుర్తింపే సంపాదించాడు. కానీ కొన్నేళ్లు ఫుల్ బిజీగా ఉన్న అతను.. సడెన్గా ఇండస్ట్రీ నుంచి మాయం అయిపోయాడు.
తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక అతను కనిపించకుండా పోవడంతో పొలిటికల్ బ్యాకప్తోనే అతను సినిమాలు చేయగలుగుతున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోహిత్ సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. గత ఏడాది ‘సుందరకాండ’ అనే చిత్రంతో పలకరించిన రోహిత్కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఇటీవలే చినిమల్లి మణికుమార్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమాను మొదలుపెట్టాడు రోహిత్.
ఐతే హీరోగా మున్ముందు ఎన్ని సినిమాలు చేస్తాడో కానీ.. రోహిత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అది పాజిటివ్ క్యారెక్టరా.. నెగెటివా అన్నది వెల్లడి కాలేదు.
ఇంతలోనే ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలో స్పెషల్ రోల్కు రోహిత్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి రూపొందించబోతున్న చిత్రంలో రోహిత్ కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట.
చిరు సినమాలో నారా రోహిత్ నటించడం ప్రేక్షకులకు కచ్చితంగా ఒక సర్ప్రైజే. రోహిత్ గతంలోనూ ‘సారొచ్చారు’ లాంటి చిత్రాల్లో క్యామియో రోల్స్ చేశాడు కానీ.. వెంకీ, చిరు లాంటి పెద్ద హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం తన కెరీర్లో కచ్చితంగా ఒక మలుపే. ఈ పాత్రలు క్లిక్ అయితే క్యారెక్టర్, విలన్ పాత్రలతో అతను బిజీ అయిపోయే అవకాశముంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…